యూపీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గోరఖ్పూర్ విశ్వవిద్యాలయంలో అరుణ్ యాదవ్ అనే యువకుడు న్యాయ విద్య అభ్యసిస్తున్నాడు. అయితే సోమవారం అతడు తన సోషల్ మీడియాలో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లపై అభ్యంతరకరమైన పోస్టులు చేశాడు. దీంతో అనేకమంది అతడిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యూపీ పోలీసులు అరుణ్ను అరెస్టు చేశారు.
అరుణ్ అరెస్టు కావడంతో అతడిని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గోరఖ్పూర్ విశ్వవిద్యాలయ అధికారులు కూడా అతడిని యూనివర్శిటీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. విద్యార్థి సోషల్ మీడియాలో చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై వర్శిటీ క్రమశిక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. విచారణకు హాజరు కావాలని విద్యార్థికి యూనివర్శిటీ అధికారులు నోటీసు కూడా పంపించారు.
ఇదిలా ఉంటే అరుణ్పై ఐపీసీ సెక్షన్ 153ఏ, 469, ఐటీ యాక్ట్ 66ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుపై సీనియర్ పోలీసు అధికారి సుమిత్ శుక్లా వివరాలను వెల్లడించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గోరఖ్పూర్ విశ్వవిద్యాలయం ఐటీ విభాగం విద్యార్థి పెట్టిన అభ్యంతరకరమైన పోస్టును రికార్డు చేసి కేసు నమోదు చేశామని తెలిపారు.