పోలీసులు.., శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. లా అండ్ ఆర్డర్ ను కాపాడటంతో పాటు వివిధ సమస్యలతో ఆత్మహత్యల వరకు వెళ్లేవారికి కౌన్సెలింగ్ ఇచ్చి వారిలో మార్పు తీసుకొస్తారు. కానీ ఒత్తిడిని తట్టుకోలేక ఓ ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడు.. గుడివాడ టౌ టౌన్ ఎస్ఐ పిల్లి విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తన అపార్ట్‌మెంట్‌లోనే ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు.రెండు నెలల క్రితమే ఎస్సై వివాహం చేసుకున్నారు. భార్యను కాపురానికి తీసుకురాలేదని తెలుస్తోంది. ఇంతలోనే విజయ్‌కుమార్ ఆత్మహత్య చేసుకోవడం కలకలంరేపుతోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.. ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు

ఈయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. విజయ్ కుమార్ గతంలో రైల్వేలో ఎస్సైగా పనిచేశారు.రైల్వేలో పనిచేసిన ఆయన అనంతరం కృష్ణా జిల్లాముసునూరు గుడ్లవల్లేరు మండవల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు

హనుమాన్ జంక్షన్‌లో విధులు నిర్వహిస్తుండగా బ్యూటీషియన్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.బ్యూటీషియన్‌తో సంబంధాల ఆరోపణలపై గతంలో ఆయన సస్పెండ్ అయ్యాడు.రెండు నెలల క్రితం విజయ్ కుమార్‌ వివాహం అయినా విజయ్ కుమార్ వ్యక్తిగత విషయాలు అంతగా సర్దుబాటు కాలేదని తెలుస్తోంది.సస్పెన్షన్ ముగిసిన తర్వాత విజయ్ కుమార్ కు గుడివాడ టూటౌన్ పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్ వచ్చింది.  భార్యను కాపురానికి తీసుకురాకుండా గుడివాడలో బ్యూటీషియన్‌తో కలిసి ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది.బ్యూటిషన్ ఒత్తిడి వల్లే విజయ్ కుమార్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.మరోవైపు ఎస్సైతో వివాహేతర సంబంధం ఉన్న మహిళతో ఏదైనా గొడవ జరిగిందా.. అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. విజయ్ కుమార్ ఫోన్ కాల్ రికార్డ్స్ ను పోలీసులు పరిశీలుస్తున్నట్లు సమాచారం.ఒక పక్క బ్యూటీషియన్ బెదిరింపులు, మరో వైపు భార్యను కాపురానికి తీసుకురాకపోవడంతో అటు వైపు నుంచి ఒత్తిడి పెరిగడంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: