ముందక్కయమ్ పట్టణానికి చెందిన రెజీ (42) అనే వ్యక్తి తన తల్లిదండ్రులు పోడియన్ (80), అమ్మినీ (76)ను కొన్ని రోజులుగా ఇంట్లోని ఓ గదిలో బంధించాడు. వారికి ఆహారం పెట్టలేదు. ఈ విషయాన్ని ఇరుగుపొరుగు వారు చాలా రోజుల కిందటే గమనించారు. అతడిని నిలదీయగా ఫూటుగా తాగొచ్చి వారిని దూషించేవాడు. అంతేకాకుండా తాను బయటకి వెళ్లాల్సి వచ్చినప్పుడు హాల్లో పెంపుడు కుక్కను వదిలిపెట్టేవాడు. రెజీ చేష్టలకు, పనులకు భయపడి స్థానికులు అతని జోలికి వెళ్ళలేదు. కానీ రోజులు గడిచేకొద్దీ స్థానికుల్లో ఆందోళన మొదలైంది. తిండి లేక ఆ ముదుసలి తల్లిదండ్రులు ఎక్కడ చనిపోతారేమోనని భయపడి, జాలిపడి ఆశా వర్కర్లకు, ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సహాయంతో వారు ఆ ఇంటికి చేరుకున్నారు. ఇక గది తెరచి చూడగా, గదిలో పడి ఉన్న వృద్ధులను చూసి హతాశులయ్యారు. వెంటనే వారిని హాస్పిటల్లో చేర్పించారు. కానీ వైద్యులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. రోజుల తరబడి ఆహారం లేకపోవటం కారణంగా ఆ వృద్ధుడి శరీర అవయవాలన్నీ దెబ్బతిన్నాయి. అందువల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ పెద్దాయన కన్నుమూశాడు. ఆయన పోస్టుమార్టం రిపోర్టు చూసిన వైద్యులు నివ్వెరపోయారు. తిండి లేక అవయవాలన్నీ ఒక్కొక్కటీ చచ్చుబడిపోయిన తీరు వారిని కంటతడి పెట్టించింది. ఇక నరరూప రాక్షసుడిగా ప్రవర్తించిన రెజీ తన తల్లిదండ్రుల పట్ల ఇంత కర్కశంగా ఎందుకు ప్రవర్తించాడనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే రెజీ భార్యను కూడా కేసులో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే ఇంకా ఆ ముదుసలి తల్లి మాత్రం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. ఆ పెద్దాయన ఎలాగూ బ్రతకలేదు కనీసం ఈ పెద్దావిడ అయినా సరే ఆరోగ్యంగా బయటపడితే అదే చాలునని పలువురు దేవుడిని కోరుకుంటున్నారు.
ముందక్కయమ్ పట్టణానికి చెందిన రెజీ (42) అనే వ్యక్తి తన తల్లిదండ్రులు పోడియన్ (80), అమ్మినీ (76)ను కొన్ని రోజులుగా ఇంట్లోని ఓ గదిలో బంధించాడు. వారికి ఆహారం పెట్టలేదు. ఈ విషయాన్ని ఇరుగుపొరుగు వారు చాలా రోజుల కిందటే గమనించారు. అతడిని నిలదీయగా ఫూటుగా తాగొచ్చి వారిని దూషించేవాడు. అంతేకాకుండా తాను బయటకి వెళ్లాల్సి వచ్చినప్పుడు హాల్లో పెంపుడు కుక్కను వదిలిపెట్టేవాడు. రెజీ చేష్టలకు, పనులకు భయపడి స్థానికులు అతని జోలికి వెళ్ళలేదు. కానీ రోజులు గడిచేకొద్దీ స్థానికుల్లో ఆందోళన మొదలైంది. తిండి లేక ఆ ముదుసలి తల్లిదండ్రులు ఎక్కడ చనిపోతారేమోనని భయపడి, జాలిపడి ఆశా వర్కర్లకు, ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సహాయంతో వారు ఆ ఇంటికి చేరుకున్నారు. ఇక గది తెరచి చూడగా, గదిలో పడి ఉన్న వృద్ధులను చూసి హతాశులయ్యారు. వెంటనే వారిని హాస్పిటల్లో చేర్పించారు. కానీ వైద్యులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. రోజుల తరబడి ఆహారం లేకపోవటం కారణంగా ఆ వృద్ధుడి శరీర అవయవాలన్నీ దెబ్బతిన్నాయి. అందువల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ పెద్దాయన కన్నుమూశాడు. ఆయన పోస్టుమార్టం రిపోర్టు చూసిన వైద్యులు నివ్వెరపోయారు. తిండి లేక అవయవాలన్నీ ఒక్కొక్కటీ చచ్చుబడిపోయిన తీరు వారిని కంటతడి పెట్టించింది. ఇక నరరూప రాక్షసుడిగా ప్రవర్తించిన రెజీ తన తల్లిదండ్రుల పట్ల ఇంత కర్కశంగా ఎందుకు ప్రవర్తించాడనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే రెజీ భార్యను కూడా కేసులో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే ఇంకా ఆ ముదుసలి తల్లి మాత్రం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. ఆ పెద్దాయన ఎలాగూ బ్రతకలేదు కనీసం ఈ పెద్దావిడ అయినా సరే ఆరోగ్యంగా బయటపడితే అదే చాలునని పలువురు దేవుడిని కోరుకుంటున్నారు.