అతిభ‌క్తి వెర్రిత‌ల‌లు వేసింది. త‌ల్లిదండ్రుల మూర్ఖ‌త్వ‌పు ఆలోచ‌న‌... మూడ‌న‌మ్మ‌కం కార‌ణంగా కంటికి రెప్పలా కాపాడాల్సిన త‌ల్లిదండ్రుల చేతిలోనే  ప్రాణాలోదిలారు ఆ యువతులు. అత్యంత దారుణంగా హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ దారుణ సంఘ‌ట‌న‌చిత్తూరు జిల్లాలో జ‌ర‌గ‌గా ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.  హత్య అనంతరం ఈ ఒక్కరోజు ఆగండి పిల్లలు తిరిగి వస్తారని నిందితులు చెప్పడం పోలీసులను విస్తుగొలిపింది. చిత్తూరు జిల్లా మదనపల్లె టీచర్స్ కాలనీకి చెందిన తల్లి పద్మజ మాస్టర్స్ మైండ్స్ కాలేజీ కరెస్పాండెంట్‌, ప్రిన్సిపాల్‌గా, తండ్రి పురుషోత్తమనాయుడు మదనపల్లె ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపల్‌ గా పని చేస్తున్నారు.


వారికి అలేఖ్య (27), సాయి దివ్య (22) ఇద్దరు కుమార్తెలు. అలేఖ్య భోపాల్ లో మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో చదవగా, చిన్నమ్మాయి బీబీఏ చదివి.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహహాన్ ఇనిస్టిట్యూట్‌లో ట్రైనింగ్ తీసుకుటోంది. అయితే గతకొద్దిరోజులుగా ఆధ్యాత్మిక సేవలో తీవ్రంగా మునిగిపోయారు. దీంతో బాలికల దినోత్సవం రోజు పురుషోత్తమనాయుడు, పద్మజలు తమపిల్లలైన అలేఖ్య,సాయిదివ్యను ఇంట్లో ఉన్న డంబెల్స్ తో దారుణంగా హత్య చేశారు. అయితే ఈ కేసులో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. వీరు గత కొంతకాలంగా ఇంట్లో అద్భుతాలు జరుగుతాయని పూజలు చేస్తున్నారు.



ఈ నేపథ్యంలో ఆదివారం కూడా ఇంట్లో పూజలు నిర్వహించి మొదట సాయి దివ్యను, తర్వాత అలేఖ్యను వ్యాయామం చేసే డంబెల్‌తో కొట్టి హత్యచేశారు. ఇంట్లో నుంచి పెద్దగా శబ్దాలు రావడంతో స్థానికులు గుర్తించి కళాశాల సిబ్బందికి, పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వెళ్లే స‌మ‌యానికి ఇంట్లోని పూజగదిలో నగ్నంగా వీరి మృతదేహాలు పడిఉన్నాయి.  పోలీసులతో విచిత్రంగా వాదిస్తూ.. మా పిల్లలు తెల్లారేసరికి బతుకుతారు. వారి మృతదేహాలను ఎవరూ తాకవద్దు అంటూ బెదిరించబోయారు. కూతుళ్ల నోట్లో చిన్నపాటి వెండికుండను ఉంచారు. అయితే వీరి హ‌త్య ను వివిధ కోణాల్లోనూ ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లుగా పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు. ఇత‌ర‌త్రా కార‌ణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: