వారికి అలేఖ్య (27), సాయి దివ్య (22) ఇద్దరు కుమార్తెలు. అలేఖ్య భోపాల్ లో మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో చదవగా, చిన్నమ్మాయి బీబీఏ చదివి.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహహాన్ ఇనిస్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుటోంది. అయితే గతకొద్దిరోజులుగా ఆధ్యాత్మిక సేవలో తీవ్రంగా మునిగిపోయారు. దీంతో బాలికల దినోత్సవం రోజు పురుషోత్తమనాయుడు, పద్మజలు తమపిల్లలైన అలేఖ్య,సాయిదివ్యను ఇంట్లో ఉన్న డంబెల్స్ తో దారుణంగా హత్య చేశారు. అయితే ఈ కేసులో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. వీరు గత కొంతకాలంగా ఇంట్లో అద్భుతాలు జరుగుతాయని పూజలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆదివారం కూడా ఇంట్లో పూజలు నిర్వహించి మొదట సాయి దివ్యను, తర్వాత అలేఖ్యను వ్యాయామం చేసే డంబెల్తో కొట్టి హత్యచేశారు. ఇంట్లో నుంచి పెద్దగా శబ్దాలు రావడంతో స్థానికులు గుర్తించి కళాశాల సిబ్బందికి, పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వెళ్లే సమయానికి ఇంట్లోని పూజగదిలో నగ్నంగా వీరి మృతదేహాలు పడిఉన్నాయి. పోలీసులతో విచిత్రంగా వాదిస్తూ.. మా పిల్లలు తెల్లారేసరికి బతుకుతారు. వారి మృతదేహాలను ఎవరూ తాకవద్దు అంటూ బెదిరించబోయారు. కూతుళ్ల నోట్లో చిన్నపాటి వెండికుండను ఉంచారు. అయితే వీరి హత్య ను వివిధ కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు. ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.