సాయంత్రం అయ్యిందంటే చాలు ఎక్కడున్నా.. పానీ పూరి బండి ముందు వాలాల్సిందేనంటూ పట్టుబడుతుంటారు చాలా మంది. పానీ పూరి బండి ఎక్కడున్నా సరే అక్కడికి వాలిపోతూ ఉంటారు. ప్లేట్ల మీద ప్లేట్లు లాగించేస్తూ.. ఆ కమ్మనైన రుచిని ఆస్వాదిస్తారు. సాయంత్రం వేళల్లోనే కదా.. స్టూడెంట్స్ అయినా.. వేరే వ్యక్తులైనా బయటకొచ్చేది. ఆ సమయంలోనే పానీ పూరీ వ్యాపారులు కూడా తమ కస్టమర్ల కోసం వెయిట్ చేస్తుంటారు. పానీ పూరి తినేవాళ్లకోసం పానీపూరి.. చాట్ తినేవాళ్లకోసం చాట్ ను తయారు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటారు. ఇక పానీ పూరిని అమ్మేవారైతే.. నా షాపు దగ్గరికే ఎక్కువ మంది రావాలి దేవుడా అంటూ కోరుకుంటూ ఉంటారు.
ఈ పానీపూరిని, చాట్ ను అమ్ముకునే పొట్ట నింపుకోవడానికి ఈ వ్యాపారం చేస్తుంటారు. అలాంటి కూటి కోసం ఈ చిరు వ్యాపారం చేసే కొందరు వ్యక్తులు దారుణంగా కస్టమర్ల కోసం కొట్లాడుకున్నారు. పానీ పూరిని అమ్ముకుంటూ పొట్టను నింపుకునే వారు కష్టపడటం మానేసి.. ఆ వ్యక్తి నా కస్టమర్.. హే లేదు అతను నా కస్టమర్ అంటూ వారు తన్నుకుచావడాన్ని చూసిన స్థానికులు నోరెళ్లబెట్టేసారు. వాయమ్మో ఇదెక్కడి దారుణం.. వీళ్లసలు కష్టపడే పనిచేసే వారేనా.. ఇంత దారుణంగా కస్టమర్ల కోసం కొట్టుకోవడమేంటని షాక్ కు గురయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని భాగ్ పత్ లో సోమవారం నాడు జరిగింది.

కస్టమర్ల కోసం ఈ పానీ పూరి వ్యాపారుల మధ్యన గొడవ తీవ్ర స్థాయికి చేరుకుంది.  అయితే ఈ గొడవలో 12 మందికి వ్యక్తులకు బాగానే గాయాలు అయినట్టు సమాచారం. కాగా ఈ దాడికి పాల్పడ్డ ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఇక అక్కడికి వెళ్లిన ఈ వ్యక్తులు ఫోటోలకు మేమంతా ఒకే కుటుంబానికి చెందిన వారమన్నట్టే ఫోజులిచ్చారు. ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం  నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: