ఈ పానీపూరిని, చాట్ ను అమ్ముకునే పొట్ట నింపుకోవడానికి ఈ వ్యాపారం చేస్తుంటారు. అలాంటి కూటి కోసం ఈ చిరు వ్యాపారం చేసే కొందరు వ్యక్తులు దారుణంగా కస్టమర్ల కోసం కొట్లాడుకున్నారు. పానీ పూరిని అమ్ముకుంటూ పొట్టను నింపుకునే వారు కష్టపడటం మానేసి.. ఆ వ్యక్తి నా కస్టమర్.. హే లేదు అతను నా కస్టమర్ అంటూ వారు తన్నుకుచావడాన్ని చూసిన స్థానికులు నోరెళ్లబెట్టేసారు. వాయమ్మో ఇదెక్కడి దారుణం.. వీళ్లసలు కష్టపడే పనిచేసే వారేనా.. ఇంత దారుణంగా కస్టమర్ల కోసం కొట్టుకోవడమేంటని షాక్ కు గురయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని భాగ్ పత్ లో సోమవారం నాడు జరిగింది.
కస్టమర్ల కోసం ఈ పానీ పూరి వ్యాపారుల మధ్యన గొడవ తీవ్ర స్థాయికి చేరుకుంది. అయితే ఈ గొడవలో 12 మందికి వ్యక్తులకు బాగానే గాయాలు అయినట్టు సమాచారం. కాగా ఈ దాడికి పాల్పడ్డ ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఇక అక్కడికి వెళ్లిన ఈ వ్యక్తులు ఫోటోలకు మేమంతా ఒకే కుటుంబానికి చెందిన వారమన్నట్టే ఫోజులిచ్చారు. ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.