అండర్ వేర్(లో దుస్తువు) దొంగిలించాడనే కారణంతో ఓ వ్యక్తి తన అనుచరుడిని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపాడు.  ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బహ్రయిచ్ జిల్లాలోని బండాలోని తిండవారి ప్రాంతానికి చెందిన అంజయ్ కుమార్, శుక్లా మొహల్లాకు చెందిన వివేక్ లు ఓకే రూం లో కలిసుండేవారు. వీరిద్దరు కాన్పూర్ లో జిల్లాలోని దేహట్ లో ఒకే కంపెనీలో  పనిచేయడంతో వీరిద్దరు కలిసే నివసించేవారు. ఈ క్రమంలోనే అజయ్ అండర్ వేర్ ను వివేక్ దొంగిలించి దాన్ని ధరించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న అజయ్ తీవ్ర కోపోద్రిక్తుడయ్యాడు.
ఇంకేముంది సహచరుడు అనికూడా చూడకుండా.. కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడకు చేరుకుని పోలీసులు విచారణ జరిపారు. బాధితుడి కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫామ్ చేశారు. అయితే ఈ ఘటన గురించి పోలీసులు ఈ విధంగా వెళ్లడించారు.. అండర్ వేర్ విషయంలో.. అజయ్ వివేక్ తో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే అజయ్ తీవ్ర కోపోద్రిక్తుడై కూరగాయలు తరిగే కత్తితో వివేక్ ను పొడిచాడు. వివేక్ ఈ దాడిలో తీవ్రంగా గాయపడటంతో అజయ్ అక్కడి నుంచి పరారయ్యాడు.

అక్కడే ఉన్న మిగతా సహచరులు వివేక్ ను ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వివేక్ ను కాన్పూర్ లోని లాలా లజపతి రాయ్ హాస్పటల్ కు తరలించారు. అతడిని పరీక్షించిన వైధ్యులు అతడు అప్పటికే ప్రాణాలు విడిచినట్టు తేల్చి చెప్పారు. కాగా ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాడు. నిందితుడు అజయ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న అతని కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: