ఇంట్లో ఒంటరిగా ఉంటుందని తెలుసుకున్న కామాంధుడు తెగించాడు. తాళం పగలగొట్టి మరీ ఇంట్లోకి వెళ్లి అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ కామాంధుడికి లాకప్లో భజన చేశారు. తమిళనాడు కాంచీపురం జిల్లా మాంకాడు సమీపంలో ఒక మహిళ నివాసం ఉంటోంది. ఆమె కుమార్తెకు 11 ఏళ్ల క్రితం మెదడికి ఆపరేషన్ జరగడంతో మాట్లాడటానికి, నడవడానికి వీల్లేకుండాపోయింది. 10 ఏళ్ల నుంచి ఆమె తన కుమార్తెను కంటికి రెప్పలా చూసుకుంటోంది. ఇంటికి తాళం వేసి వెళుతున్న తల్లి ప్రతిరోజూ ఉదయం ఇంట్లో కుమార్తెను పెట్టి తాళం వేసి పనికి వెళ్లి సాయంత్రం వచ్చి కూతురి బాగోగులు చూసుకుంటోంది.
మాట్లాడటానికి, నడవడానికి అవకాశం లేకపోవడంతో కుమార్తె ఇబ్బంది పడకుండా ఆమె ఇలా ఇంటికి తాళం వేసి వెళుతున్న విషయం చుట్టుపక్కల వాళ్లకు తెలుసు. ఆమె ఇంటి సమీపంలోని లారీ డ్రైవర్ గా పని చేస్తున్న ముత్తు (36) అనే కామాంధుడు నివాసం ఉంటున్నాడు. ఇంటికి తాళం వెసి పనికి వెళ్లిన గంట తరువాత ముత్తు ఆమె ఇంటి తాళం పగలగొట్టాడు. ఇంట్లో నిస్సహాయంగా ఉన్న యువతి మీద ముత్తు అత్యాచారం చేశాడు. బాధితురాలు తప్పించుకోవడానికి వీల్లేకపోవడంతో ముత్తు రెచ్చిపోయి సాయంత్రం వరకు కామం తీర్చుకున్నాడు. సాయంత్రం ఇంటికి వెళ్లిన ఆమెకు కుమార్తె తన మీద అత్యాచారం జరిగిందని సైగలు చేసి చెప్పింది. పూనమల్లై మహిళా పోలీసులకు సమాచారం ఇచ్చింది. బాలిక తెలిపిన వివరాల ఆధారంగా లారీ డ్రైవర్ ముత్తును పట్టుకున్న పోలీసులు స్టేషన్కు తీసుకువెళ్లి పూర్తిస్థాయిలో పిండేశారు. భవిష్యత్తులో ఇటువంటి పనులు చేయకుండా ఉండేలా ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, మహిళా సంఘాలు నిందితుణ్ని బయటకు రావడానికి వీల్లేనిరీతిలో శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. మంచంమీద కదల్లేని పరిస్థితుల్లో నిస్సహాయంగా ఉన్న యువతిపై కనికరం, మానవత్వం లేకుండా వ్యవహరించిన ముత్తుకు కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.