శారీర‌కంగా స్త్రీ పురుషుడిక‌న్నా బ‌లహీనంగా ఉండ‌టం మృగాళ్ల‌కు క‌లిసివ‌స్తోంది. దీంతో క‌ళ్లుమూసుకుపోయిన కామ‌వాంఛ‌ల‌తో య‌థేచ్ఛ‌గా చెల‌రేగుతున్నారు. వావివారుస‌లు మ‌రిచి, క‌న్నూమిన్నూ కాన‌రాకుండా విచ్చ‌ల‌విడిగా అఘాయిత్యాలు, అత్యాచారాల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా హర్యానాలోని కురుక్షేత్రలో దారుణం జ‌రిగింది. స్నేహితురాలి ఇంటికెళ్లిన 17 ఏళ్ల బాలికకు మత్తు ఇచ్చి ఐదుగురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు.

కురుక్షేత్ర జిల్లా బబైన్‌ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల‌ బాలిక 12వ తరగతి చదువుతోంది. కొంత కాలంగా స్కూల్‌ ముగిసిన తర్వాత స్పోకెన్ ఇంగ్లీషు క్లాసులకు హాజరవుతోంది. సాయంత్రం 4.30 గంటలకు ఇంటికి తిరిగివస్తోంది. కానీ, సోమవారం సాయంత్రం చీకటి పడుతున్నా  ఇంటికి రాక‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు చెప్పే టీచర్‌ను సంప్రదించగా ఆమె ఆ రోజు క్లాస్‌లకే హాజరు కాలేదని చెప్పారు. బంధువులు, తెలిసిన‌వారి సాయంతో చుట్టుప‌క్క‌ల  ప్రాంతాల్లో గాలించారు. రాత్రి 7 గంటల సమయంలో ఆ బాలిక బరారా చౌక్‌ వద్ద ఓ బైక్ మీద కనిపించింది. ఇద్దరు యువకులు ఆమెను బైక్‌పై కూర్చోబెట్టి తీసుకెళ్తుండగా కుటుంబసభ్యులు అడ్డగించి పోలీసుల‌కు అప్ప‌గించ‌గా అన్ని విష‌యాల‌కు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

సోమవారం ఎప్పట్లాగే స్కూలుకు వెళ్లిన బాధితురాలు తరగతులు ముగిసిన అనంతరం తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అక్కడ స్నేహితురాలు ఆమెకు తాగడానికి డ్రింక్ ఇచ్చింది. ఆ తర్వాత కాసేపటికే ఆమె కళ్లు తిరుగుతున్నాయని చెప్పింది. దీంతో తన కజిన్ అజయ్ (18) ఆమెను ఇంటి దగ్గర దింపుతాడని స్నేహితురాలు చెప్పింది. అజయ్‌ ఆమెను బైక్‌పై ఎక్కించుకొని ఇంటి వద్ద దింపకుండా నేరుగా ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడికి మరో నలుగురు స్నేహితులున్నారు.   వారంతా కలిసి హోటల్ గదిలో అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకడైన అభిషేక్ (18) ఆ హోటల్‌లో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

బాలికను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అఘాయిత్యం జరిగినట్లు తెలిపారు. పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించ‌గా మిగిలిన నలుగురు నిందితుల గురించి కూడా వివరాలు చెప్పాడు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా నిందితులందరినీ అదుపులోకి తీసుకొని జడ్జి ముందు ప్రవేశపెట్టారు. మైనర్ బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: