ఇద్దరూ ప్రేమించుకున్నారు. చట్టాపట్టాలేసుకుని తిరిగారు. మనసులతో పాటు శరీరాలు కూడా ఒక్కటయ్యాయి. దాంతో  యువతి పెళ్లి చేసుకోవాలని కోరింది. యువకుడు పెళ్లికి నిరాకరించడంతో సుపారీ ఇచ్చి హత్య చేయించింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర లోని నాగ్ పోర్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే....నాగ్ పూర్ కు చెందిన చందు మహాపూర్ స్థానికంగా 20 ఏళ్ల ఓ యువతితో ప్రేమలో పడ్డారు. కొద్ది రోజులు గాఢంగా ప్రేనించుకున్న ఇద్దరూ శారీరకంగా కూడా అనేక సార్లు కలిశారు. ఇక చందునే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యిన యువతి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. అయితే అప్పటికే పెళ్ళైన చందు యువతితో రెండో పెళ్లికి నిరాకరించాడు. దాంతో యువతి పగ పెంచుకుంది. ప్రియుడిని కడతేర్చాలని డిసైడ్ అయ్యింది. దాంతో చందు స్నేహితుడు..దూరపు బంధువు అయిన భరత్ గుర్జార్ ను ఎంచుకుంది. అతడికి లక్షన్నర డబ్బులతో పాటు పడక సుఖాన్ని కూడా ఆఫర్ చేసింది.

ఇంకేముంది ఆఫర్ నచ్చడం తో  చందు ను హత్య చేసేందుకు ఒప్పుకున్నాడు. చందు ను తీసుకువెళ్లి పూటుగా మద్యం తగ్గించాడు. ఆ తరవాత బండరాయి తలపై మోపి హత్య చేశాడు. అనంతరం బాడీని తీసుకువెళ్లి మారు మూల ప్రాంతం లో పడేసాడు. మరుసటి రోజు మృతుడి భార్య తన భర్త కనిపించడం లేదంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించగా..చందు భరత్ కలిసి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. దాంతో భరత్ ను విచారించగా...చందు ప్రియురాలు సుపారీ ఇచ్చిందని...దాంతో పాటు పడక ఆఫర్ కూడా ఇవ్వడంతో తానే హత్య చేసినట్టు వెల్లడించారు. ఈ ఘటన లో యువతి తల్లి తండ్రులు పాత్ర కూడా ఉండటం తో పోలీసులు అందరినీ అరెస్ట్ చేసి బొక్కలో వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: