ప్రస్తుత సమాజం పరిస్థితి అర్థవంతంగా లేదు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. విలాసాలు, భోగాలకు అలవాటు పడుతుండటం, దానికి సొమ్మలు అవసరమవుతుండటంతో మానవ సంబంధాలకన్నా మొదటి ప్రాధాన్యత డబ్బుకే ఇస్తున్నారు. ఆడబ్బు మనిషిని ఎటువంటి పనులకైనా ప్రేరేపిస్తోంది. ఎటువంటి పనులైనా చేపిస్తోంది. ఈ తరహా ధోరణలు సమాజంలో రోజురోజుకు పెరిగిపోతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. మానవ సంబంధాలకన్నా డబ్బుకే ప్రాధాన్యమివ్వడంవల్ల రాబోయే తరాలపై ఈ ప్రభావం పడుతుందని, ఆరోగ్యకరమైన సమాజాన్నిసృష్టించలేమంటూ ఇప్పటికే మానసిక శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలోని నాగపూర్లో జరిగిన ఓ దారుణం ఈ కోవలోకే వస్తోంది. వివాహం చేసుకోవడానికి అడ్డుపడుతున్నాడంటూ ప్రియుణ్నే చంపించింది ఓ యువతి. అందుకు ఆమె హంతుకుడికి ఇచ్చి సుపారీ ఏమిటో తెలుసా.. ఓ రాత్రి ఏకాంతంగా నీతో గడుపుతాను అని.
మహారాష్ట్రలోని నాగపూర్లో దారుణం జరిగింది. ఆమెకి మరొకరితో పెళ్లికి సిద్ధమైంది. ప్రియుడు మాత్రం అంగీకరించలేదు. పెళ్లి చేసుకోవద్దని ఒత్తిడి తెచ్చాడు. ఆమె కోపం కట్టలు తెంచుకుంది. అతడిని శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఓ హంతుకుడితో మాట్లాడింది. ప్రపంచంలో ఎవరూ ఇవ్వని సుపారీ ఇస్తానంది. చెప్పినట్లు చేస్తే ఓ పూట అతనితో గడుపుతానంది. దీంతోపాటు లక్షన్నర రూపాయలు ఇస్తానంది. దీంతో అనుకున్నది సాధించుకుంది.
బాధితుడి పేరు చందూ మహాపూర్. ఆ యువతి ప్రణాళిక విజయవంతమైంది. తుదిశ్వాస విడిచాడు. ఆ యువతి సుపారీ ఇచ్చింది ఎవరికోకాదు.. చందూ మహాపూర్కు బందువవుతాడు. అతడిపేరు భరత్ గుర్జార్!. వారిద్దరికీ గతంలో కొన్ని ఆర్థికపరమైన వివాదాలున్నాయి. అయితే..యువతి ఇచ్చిన ఆఫర్ నచ్చడంతో గుర్జార్ మరో ఆలోచన లేకుండా పని పూర్తి చేసేశాడు. మద్యం సేవిద్దాం రమ్మంటూ చందూను నిర్మానుష్యా ప్రాంతానికి తీసికెళ్లి, తల పగలకొట్టి గొంతు కోసి అంతమొందించాడు. ఆ తరువాత మృతదేహాన్ని ఓ క్రషర్ మైన్ వద్ద పారేశాడు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఆధారంగా పోలీసులు గుర్జార్ను శుక్రవారం అరెస్టు చేశారు. కోరిన ‘ప్రతిఫలం’ గుర్జార్కు అందకమునుపే! యువతితోపాటు ఆమెకు సహరించిన తల్లిదండ్రులపై కూడా పోలీసుల కేసు నమోదు చేశారు.