విశాఖలో నరమేధం విషాద చాయలు ఇంకా వీడలేదు. ఒకరు ఇద్దరు కాదు.. ఆరుగురు అది కూడా ఒకే కుంటుబానికి చెందిన వారు. అందులో ఆరు నెలల పసిపాప, రెండేళ్ల బాలుడు కూడా ఉన్నారు. పోలీసుల విచారణలో నిందితుడు అప్పలరాజు కొత్త కొత్త విషయాలు చెబుతున్నాడు. విజయ్ భార్య వెటకారపు నవ్వే తనలోకసి పెంచింది అంటున్నాడు. కేవలం 15 నిమిషాల్లో అందర్నీ అంతమొందించానని చెప్పాడు. అయితే ఈ హత్య కేసులో అప్పలరాజుతో పాటు మరికొందరు ఉన్నారంటున్నాడు బాదిత కుటుంబ సభ్యులు.

ఇక ఇదిలావుంటే, పోలీసుల విచారణలో కొత్త విషయాలు వెల్లడించాడు నిందితుడు. విచారణ అనంతరం అప్పలరాజును 14 రోజుల రిమాండ్‌కు తరలించారు పోలీసులు. చిన్న పిల్లలను కూడా చంపేంత కసి అతడిలో ఎందుకు పెరిగింది..? పాత కక్షలుంటే మాత్రం ఇంత పాశవిక హత్యలా..? అసలు అప్పలరాజు రాక్షసుడిలా ఎందుకు మారాడు…?

అయితే విజయవాడ నుంచి విజయ్‌కిరణ్‌ అనే వ్యక్తి పెందుర్తి మండలం జుత్తాడ వచ్చాడని తెలియడంతోనే అప్పలరాజు కత్తి తీసుకొని వారింటికి వెళ్లినట్టు తెలుస్తోంది. తన కుమార్తెకు పెళ్లి కాకుండా విజయ్ కుమార్ అడ్డుపడుతున్నాడని.. అందుకే అతడి కుటుంబంలో ఎవరినీ వదిలిపెట్టకూడదనే ఉద్దేశంతో కనిపించిన వారిని కనిపించినట్టుగా నరికేశాడని నిందితుడు పోలీసులు చెప్పినట్టు సమాచారం.

అంతేకాక తాను హత్య చేయడానికి అక్కడకు వెళ్లిన తరువాత విజయ్ కిరణ్ కనిపించకపోవడం.. అతడి భార్య వెటకారంగా నవ్వడంతో తనలో మరింత కసి పెరిగింది అంటున్నారు. అయితే సాయంత్రం విజయవాడ నుంచి విజయ్‌కిరణ్‌ వచ్చాడని పోలీసు మాటల ద్వారా విన్న నిందితుడు. తనను ఒక్క గంట వదిలిపెట్టండి. కోటి రూపాయలు ఇస్తాను. వాడిని కూడా వేసేసి వచ్చి మళ్లీ లొంగిపోతా అంటూ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో అతడి మానసిక పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది అంటున్నారు పోలీసులు.

అయితే తన కుమార్తెను విజయ్‌కిరణ్‌ మభ్యపెట్టి లొంగదీసుకున్నాడని.. అంతే కాకుండా ఆమె ద్వారా అతడి కుటుంబ సభ్యులంతా ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారని అప్పలరాజు అనుమానం పెంచుకున్నడాని అదే విషయంలో తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని కొందరు స్థానికులు చెబుతున్నారు. మూడేళ్ల కిందట ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు అంటున్నారు. తన కుమార్తెకు పెళ్లి సంబంధాలు వస్తుంటే...వారే చెడగొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: