నేటి సమాజంలో రోజురోజుకు అక్రమ సంబంధాలు పెరుగుతూ ఉన్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా చాల మంది వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా అలాంటి కోణంలోనే మరో ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భర్తకు దూరంగా ఉంటున్న భార్య.. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇక ఆమె తన కూతురితో సహా వచ్చేసి ప్రియుడితో సహజీవనం చేస్తోంది. ఇక ఇంట్లో తల్లిలేని సమయంలో కూతురిపై నీచానికి పాల్పడుతున్నాడు. సవతి తండ్రి ఘాతుకంపై పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన పంజాబ్‌లో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..  సంగూర్ జిల్లాకు చెందిన మహిళకు 2000 సంవత్సరంలో వివాహమైంది. ఆమెకు భర్తతో మనస్పర్థలు తలెత్తడంతో నాలుగేళ్ల కిందట విడిపోయింది. తన 14 ఏళ్ల కూతురితో ఆమె విడిగా ఉంటోంది. ఈ తరుణంలో ఆమెకు తనకంటే వయసులో చిన్నవాడైన యువకుడు(27)తో పరిచయమై వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో సహజీవనం చేయడం మొదలుపెట్టారు. కూతురితో సహా కలిసే ఉంటున్నారు.

అయితే తల్లితో సహజీవనం చేస్తున్న ప్రబుద్ధుడి కన్ను కూతురిపై పడింది. ఇక ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఇక ఆమె కూతురు ఒంటరిగా దొరికితే లైంగిక వాంఛలు తీర్చుకునేవాడు. అతడు పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఇక అండగా ఉంటాడనుకున్న ప్రియుడే తన కూతురి జీవితం పాడు చేయడం చూసిన తల్లి నిర్ఘాంతపోయింది.

ఇక కూతురిపై అత్యాచారం చేసిన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదేంటని అడిగినందుకు తనను కూడా చావబాదాడని ఆమె ఫిర్యాదులో వెల్లడించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై అత్యాచారం, పోక్సో, నేరపూరిత కుట్ర తదితర కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: