రోజురోజుకు తెర మీదకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే మనుషులు క్రూరమృగాల కంటే దారుణం గా మారిపోతున్నారూ అని అనిపించక మానదు. మానవత్వానికి మనుషులు పెట్టింది పేరు కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మనుషుల్లో ఆ మానవత్వమే కనుమరుగైపోతుంది. వెరసి సాటి మనుషుల ప్రాణాలు విషయంలో కూడా కాస్త జాలి దయ చూపించడం లేదు మనుషులు. పరాయి వాళ్ళ విషయంలోనే కాదు సొంత వాళ్ల విషయంలో కూడా ఉన్మాదులు గా మారి పోయి ఏకంగా హత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి.



 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.  కష్ట సుఖాల్లో తోడు ఉండి చివరి వరకు కష్టసుఖాలను పంచుకుంటాను అంటూ ప్రమాణం చేసిన భర్త చివరికి ఆ భార్యపట్ల యమకింకరుడు గా మారిపోయాడు. భార్యపై అనుమానంతో పెళ్లి జరిగిన నాటి నుంచి తీవ్ర వేధింపులకు గురి చేస్తూ వచ్చిన భర్త చివరికి వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను పొట్టన పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకుని పుట్టింటిని వదిలి మెట్టినింట్లో అడుగుపెట్టిన ఆ మహిళకు ఏడు నెలలు కూడా తిరక్క ముందే చివరికి చావు ను పరిచయం చేశాడు ఆ భర్త. ఇక భార్యను దారుణంగా చంపడమే కాదు అనంతరం భార్య శవంతో సెల్ఫీ కూడా తీసుకున్నాడు.



 ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా బద్వేలు వెలుగులోకి వచ్చింది ఇటీవలే భార్యను దారుణంగా కత్తితో నరికి చంపాడు భర్త. భార్య మంజుల పై అనుమానం పెంచుకుని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. హరి, మంజులకు ఏడు నెలల క్రితమే పెళ్లి జరిగింది. అయితే కొన్ని రోజుల వరకు అంత సాఫీగా సాగిపోయినప్పట్టికి ఆ తర్వాత మాత్రం భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త. సూటిపోటి మాటలతో వేధించేవాడు. చివరికి అదే అనుమానంతో కట్టుకున్న భార్యపై దారుణంగా కత్తితో దాడి చేసి నరికి చంపాడు  రక్తపు మడుగులో చనిపోయి ఉన్న భార్యతో అనంతరం సెల్ఫీ తీసుకున్నాడు ఆ సైకో భర్త. ఇక ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: