ఇరాక్ మనీషాకు పెళ్లి కుదిరిందని పిలవడానికి వచ్చినట్లు వారు చెప్పారు. దీంతో ఆనందం వ్యక్తం చేసిన రాధాదేవి.. వారికి విందు భోజనం ఏర్పాటు చేసింది. పెళ్లి ముచ్చట్లు, కరోనా ముచ్చట్లతో అక్కడే ఆలస్యమైంది. ఇక కర్ఫ్యూ ఉండడంతో రాత్రికి ఇంటిలో ఉండి.. మరుచటి రోజు వెళ్లమని రధాదేవి చెప్పింది. రాధాదేవి చెప్పిన మాటలకు సరే అన్న మనీషా, వాళ్ల అమ్మ కూడా రాత్రికి అక్కడే పడుకున్నారు. మరుసటి రోజు తెల్లవారుతూనే ఒంగోలుకు వెళ్లిపోయారు.
అయితే తరువాత ఏదో పని మీద రాధాదేవి బీరువా ఓపెన్ చేసి చూసి షాక్ కు గురైంది. ఇక అందులో ఉండాల్సిన బంగారపు వడ్డాణం, చెవిదిద్దులు, నక్లెన్, పట్టుచీర అన్నీ మిస్ అయ్యాయి. వెంటనే రాధాదేవి పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మొదటి అనుమానితులుగా మనీషా, ఆమె తల్లి రూన్సీలే అని భావించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని తమదైన స్ఠైల్లో విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించారు. ఇద్దరిని గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద సోమవారం అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి 10 లక్షలు విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇక కరోనా కాలంలో ఎవరిని నమ్మాలి అని గుంటూరు వాసులు భయపడుతున్నారు.