భారతదేశపు సంప్రదాయంలో ఒక్క స్త్రీ కి మాత్రమే ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు ఇవ్వబడతాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే భారతదేశం లో తప్ప మరెక్కడా స్త్రీ ను  పూజించరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కొన్ని మానవ మృగాలు ఈ ధర్మాన్ని మరచి పోయి, ఎన్నో దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇది తప్పు అని తెలిసినప్పటికీ పదేపదే దానినే చేస్తూ ,ఆడవారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారు కొంతమంది మానవమృగాలు.

ఇలాంటి నేపథ్యంలో నిర్భయ  కేసులు ఎన్నో నమోదయ్యాయి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ మృగాళ్ల పైశాచికత్వానికి మాత్రం ఆగడం లేదు. కామాంధుల చేతిలో మహిళల బ్రతుకులు అంధకారం లోకి పోతున్నాయి. అయితే ఇలాంటి సంఘటన తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగింది. ఒక మహిళపై అత్యాచారం చేసి, అత్యంత కిరాతకంగా గొంతు కోశారు గుర్తుతెలియని వ్యక్తులు. ఆ తర్వాత ఆమె శవాన్ని బాంద్రా కుర్ల కాంప్లెక్స్ దగ్గర ఉన్న డ్రైనేజీ లో పడేశారు.

మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం బుధవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకొని, మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దేహాన్ని పరిశీలించి ఆమెపై అత్యాచారం చేసి, గొంతు కోసి చంపినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇక ఆమెను పోస్టుమార్టం నిమిత్తం, విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నిర్భయ కేసు కంటే దారుణంగా మర్మాంగాలను భారీగా గాయపరచినట్టు అందులో వెల్లడైంది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ విషయంలో తేలిందేమిటంటే ,ఆమె వృత్తిరీత్యా వేశ్య అని, విటులకు ,ఆమెకు మధ్య డబ్బుల విషయంలోనే గొడవ జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి గుర్తుతెలియని వ్యక్తుల పై 376  అత్యాచారం , 302 హత్య సెక్షన్లపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా త్వరలో నిందితులను పట్టుకుంటామని కూడా పోలీసులు చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: