తల్లి , దండ్రులు అంటే దైవంతో సమానంగా భావించాల్సింది పోయి, అతి కిరాతకంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. ఆస్తి పంచలేదని ఓ కొడుకు కన్న వాళ్ళు అని కూడా లేకుండా చంపేశాడు. ఇటీవల ఇలాంటి ఘటనలు లెక్క లేనన్ని వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు జరిగిన ఘటన మాత్రం జనాలను భయానికి గురిచేస్తుంది.

ఇక విషయానికొస్తే.. ఆర్థిక సాయం చేయ‌కపోవ‌డం, ఆస్తిలో వాటా పంచ‌క‌పోవ‌డం తో తల్లితండ్రుల‌ పై కోపం పెంచుకున్న కొడుకు ఆపై వృద్ధ దంప‌తుల ఉసురుతీశాడు. ప‌ట్నాలోని రామ‌క్రిష్ణ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధి లో శివాజీ చౌక్ ప్రాంతం లో వృద్ధ జంట నివాసం లోనే వారి కుమారుడు ఈ దారుణాని కి ఒడిగ‌ట్టాడు. ఏ ఉద్యోగం లేకుండా తిరిగే రాజ‌న్ కుమార్(50) త‌న తండ్రి రిటైర్డ్ టీచ‌ర్ బ్రిజ్ కిషోర్ ప్ర‌సాద్ సింగ్ (70), త‌ల్లి క‌మ‌ల్ ల‌తా దేవి(68)ని కనికరం లేకుండా పొట్టన పెట్టుకున్నాడు.

ఈ దారుణానికి అతని భార్య కూడా సాయం చేయడం అమానుషం. త‌ల్లితండ్రుల‌ను గొంతు పిసికి హ‌త్య చేశాడు. ఆపై కొవిడ్-19 తో త‌న త‌ల్లితండ్రులు మ‌ర‌ణించార‌ని న‌మ్మ‌బ‌లికాడు. ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్న పోలీసుల‌కు వృద్ధ జంట గొంతు పై పెనుగులాడిన చిహ్నాలు క‌న‌ప‌డ‌టం తో రాజ‌న్ ను ప్ర‌శ్నించారు. నిందితులు రాజ‌న్ ఆయ‌న భార్య, కుమారుడు అవినాష్ ల‌కు హ‌త్యో దంతంలో ప్ర‌మేయం ఉంద‌ని తేల‌డం తో పోలీసులు వారిని అదుపు లోకి తీసుకున్నారు. గతంలో కూడా తండ్రి ఉద్యోగం వస్తుందనే దుర్బుద్ధితో చంపడానికి ప్రయత్నించినట్లు తెలుస్తుంది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని రిమాండ్ కు తరలించనున్నారు.ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో అతన్ని ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: