వివరాల్లోకి వెళితే.. 1983లో ఉత్తర కరొలినా రాజధాని రాలీలోని నార్త్ రాబ్సన్ కౌంటీలో 11 ఏళ్ల బాలిక తన ఇంట్లో హత్యాచారానికి గురైంది. ఈ కేసులో హెన్రీ మెక్కల్లమ్, లియోన్ బ్రౌన్ అనే ఇద్దరు సోదరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పుడు సాక్షాలతో వారిపై రాబ్సన్ జిల్లా కోర్టులో అభియోగాలు మోపారు. వారికి కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
అయితే 2014లో ఆ ఇద్దరి డీఎన్ఏను పరిశీలించిన తర్వాత బాలికను అత్యాచారం, హత్య చేసింది వారు కాదని తేలింది. రోస్కో ఆర్టిస్ అనే వేరే వ్యక్తి ఈ నేరానికి పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో కోర్టు వారిద్దరిపై ఉన్న కేసులను కొట్టివేసింది. తప్పుడు కేసులు మోపి, తాము శిక్ష అనుభవించడానికి కారుకులైన జేమ్స్ లాక్లియర్, కెన్నెత్ సీలి అనే పోలీసు అధికారులపై ఆ ఇద్దరు సోదరులు 2015 నుంచి కోర్టులో పోరాటం చేశారు. మెకల్లమ్, బ్రౌన్కు రూ.550 కోట్ల పరిహారం చెల్లించాలని నార్త్ కరోలినా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ అధికారుల తరఫున వాదించిన న్యాయవాదులు రూ.66 కోట్ల పరిహారం చెల్లించేందుకు ఒప్పుకున్నారు. అయితే ఆ ఇద్దరు సోదరులు మానవహక్కుల ఉల్లంఘన కింద కోర్టులో పోరాడారు.