అక్రమ సంబంధాలు ఈ మధ్య పెరిగి పోతున్నాయి.. శారీరక సుఖం కోసం కన్న వాళ్ళను కూడా కాటికి పంపిస్తున్న రోజులు ఇవి.. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా ఈ సంబంధాలకు ఆకర్షితులు అవుతున్నారు. ప్రియుడితో శృంగారానికి అడ్డుగా వచ్చిన వాళ్ళను చంపుకుంటూ పోతున్నారు.. ఇప్పుడు కూడా అలాంటి ఘటన వెలుగు చూసింది.తన ప్రియుడితో కలిసి బంగారం డబ్బులు మరోవ్యక్తికి సుపారిగా ఇచ్చి హత్య చేయించింది. అయితే హత్య జరిగిన నాలుగు రోజులకే పోలీసులు మిస్టరీ చేధించి ఇందుకు కారణమైన భార్య ,ప్రియుడు, సుపారి తీసుకున్న వ్యక్తులను అరెస్ట్ చేశారు.


విషయానికొస్తె.. ఈ దారుణ ఘటన తెలంగాణ కోదాడ లో వెలుగు చూసింది.మన్నూరు వెంకన్నకు పదమూడు సంవత్సరాల క్రితం సైదమ్మ అనే మహిళతో వివాహం జరిగింది..కొద్ది రొజుల పాటు ఇద్దరి మధ్య సజావుగా సంసారం సాగడంతో ఇద్దరు మగపిల్లలు పుట్టారు. రోజు కూలికి వెళ్ళే వెంకన్న సొంత ఊరిని వదిలేసి మిర్యాలగుడా లో ఉన్నారు. రోజు పనికి వెళ్ళడం వచ్చిన డబ్బులతో కుటుంబ పోషణ చూసుకొనే వాడు.. అక్కడ సైదులు అనే వ్యక్తి తో అక్రమ సంబంధాన్ని పెట్టుకుంది.


ఇటీవల వీరిద్దరి సంబంధం భర్తకు తెలియడంతో మందలించాడు.. తర్వాత అక్కడ రూమ్ ఖాళీ చేసి కోదాడ వచ్చాడు..అప్పటికి భార్య ప్రవర్తన లో మార్పు రాలేదు..  ఆమె సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని, అంత మొందించాలని ప్లాన్ వేసి సుఫారి కూడా ఇచ్చింది. అనుకున్న ప్రకారం సుఫారి తీసుకున్న వ్యక్తి తో బయటకు రప్పించి, పూటుగా మందు తాగించాడు. మత్తులో ఉండగానే బండ రాయి తో మోదీ చంపెసారు.కొడుకు మరణంపై వెంకన్న తల్లి అప్పుడే అనుమానాలు వ్యక్తం చేసింది..దీంతో పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని ..నాలుగు రోజుల్లోనే సైదమ్మ ప్రధాన సూత్రధారిగా కనుక్కొన్నారు..ఆమె ప్రియుడు, చంపిన వ్యక్తిని అరెస్ట్ చేశారు..


మరింత సమాచారం తెలుసుకోండి: