కడుపున పుట్టిన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తల్లి బిడ్డను రాచి రంపాలు పెట్టింది. తన సుఖాల కోసం చిన్నారిని అతి దారుణం గా కొట్టింది. ఆ పాప చిత్రహింసలు అనుభవించడానికి కారణమైంది. అభం శుభం తెలియని చిన్నారిని ప్రియుడు దారుణం కొడుతుంటే.. తనకేం సంబంధం లేనట్టుగా చూస్తూ ఉండిపోయింది. అక్రమ సంబంధం ఆమె కడుపు తీపిని కట్టిపడేసింది. ఇది నిజంగా అమానుషం.. తల్లి మాటకే ఈ మహాతల్లి కలంకం తీసుకొచ్చింది.


వివరాల్లొకి వెళితే.. ఈ షాకింగ్ ఘటన కేరళలోని కన్నూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. రమ్య అనే మహిళకు మొదటి భర్తతో ఉన్న సమయంలో పాప జన్మించింది. ఆ తర్వాత ఆమె రతీష్‌ అనే వ్యక్తి తో కలిసి సహజీవనం చేస్తుంది. రమ్య, రతీష్ మూడు వారాలుగా చిన్నారి కలిసి కేలకంలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే రతీష్‌ కు రమ్య మొదటి సంతానం వల్ల కలిగిన చిన్నారిపై ఇష్టం ఉండేది కాదు.. దాంతో ఆ చిన్నారిని ఇష్టమోచ్చినట్లు కర్రతో చితక బాదారు..


ఆమె తలకు, చేతులకు గాయాలు అయ్యాయి. బాలిక అమ్మమ్మ.. రమ్య తో ఫోన్‌లో మాట్లాడుతున్న సమయం లో ఈ విషయం తెలుసుకుంది. బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లమని కూతురిని హెచ్చరించింది. బాలికను కన్నూర్‌ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. బాలిక భుజం విరిగిందని. తలకు కూడా గాయం అయిందని వైద్యులు ఆమె అమ్మమ్మ కు తెలిపారు. బాలికకు తీవ్ర గాయాలు కావడం చూసిన వైద్యులు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్యుల వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి రతీష్‌తో పాటుగా ఆమెపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం బాలిక అమ్మమ్మ.. సంరక్షణ లో ఉంది. చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: