సమాజంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరు కామాంధుల ఆగడాలకు బలైపోతున్నారు. తాజాగా ఇదే కోవలో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ వ్యక్తి ఏడేళ్ల  బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలోని కటోల్ తహసీల్‌లో ఓ గ్రామానికి చెందిన 7 ఏళ్ల బాలిక ఇంటికి సమీపంలో ఉన్న పాఠశాల మైదానంలో ఆడుకుంటుంది. ఇక అదే ప్రాంతానికి చెందిన అంకుష్ భోస్కర్ 25 ఏళ్ల వ్యక్తి బాలిక వద్దకు చేరుకున్నాడు. అనంతరం బాలికను పాఠశాల టాయిలెట్‌లోకి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేశాడు.

అయితే ఈ విషయం ఎవరితోనైనా చెబితే చంపేస్తానని బాలికను బెదిరించాడు. ఇక అదే ఆ సమయంలో అటుగా వెళ్తున్న గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి పాఠశాల టాయిలెట్‌ వైపు వచ్చాడు. అక్కడ అతడికి బాలిక అరుపులు వినిపించాయి. ఇక దీంతో వెంటనే అతడు బాలిక వద్దకు చేరుకుని ఆమెను రక్షించాడు. అయితే నిందితుడు అంకుష్.. మాత్రం అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు.

స్థానికుల సమాచారం మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక నిందితుడు అంకుష్ భోస్కర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇక అతనిపై ఐపీసీ సెక్షన్లు 376(ఎ)(బి), 506లతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసులు నిందితుడు స్థానిక కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. అయితే కోర్టు అతనికి మూడు రోజుల పోలీస్ కస్టడీ రిమాండ్ కి తరలించారు.

మరోవైపు దేశంలో రోజురోజుకు మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక నిత్యం ఏదో ఒక చోట మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి నేరాలకు పాల్పడేవారిలో చాలా మంది మహిళలు, బాలికలకు తెలిసినవారు, చుట్టుపక్కల నివసించేవారే కావడం ఆందోళన కలిగిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: