అయితే జూన్ 12న రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అయోధ్యనగర్లోని తన సొంత ఇంట్లో ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించింది. అంతే కాదు తాను చనిపోతున్నానంటూ సీసీఎస్లో పనిచేసే ఓ ఎస్సైకి సమాచారం ఇచ్చి మరీ చనిపోవడానికి ప్రయత్నించింది. దీంతో వెంటనే సదరు ఎస్సై సత్యనారాయపురం సీఐ బాలమురళీకృష్ణకు చెప్పి ఇన్టైమ్లో ఆమె ఇంటికి వచ్చాడు. వెంట వెంటనే అజిత్సింగ్నగర్, సత్యనారాయణపురం పోలీసులు ఆమె ఇంటికి తలుపులు పగలగొట్ట మరీ లోపలికి వెళ్లారు.
కాగా అప్పటికే ఆమె కింద పడిపోయి ఉండటంతో పక్కన ఉన్న గోళ్ల రంగు, శానిటైజర్ సీసాలు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని అంచనాకు వచ్చారు పోలీసులు. దీంతో ఆమెను వెంటనే సింగ్నగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి ఆమెకు చికిత్స అందించారు. ఆ తర్వాత ఆమె కుటుంబసభ్యులకు సదరు యువతిని అప్పగించారు. అయతే సదరు యువతి అయిన పీఎస్సై ఆత్మహత్యాయత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమని స్పష్టంగా సమాచారం ఉంది.
సీసీఎస్లో పనిచేసే ఓ ఎస్సైని ఆమె ప్రేమించిందని, కానీ అతడు ఇటీవల మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో ఈమె తీవ్ర మనస్థాపానికి చెందినట్టు తెలుస్తోంది. అందుకే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తెలుస్తోంది. ఇక మహిళా పీఎస్సైపై స్థానిక అజిత్సింగ్నగర్ పోలీసులు ఆదివారం కేసు రిజిస్టర్ చేసి విచారణ చేశారు. ఇక ఆత్మహత్యకు యత్నించిన యువతిపై వారం కిందట మాచవరం పోలీసులకు ఫిర్యాదు అందిందని సమాచారం. యువతి ప్రేమించిన ఎస్ఐ కి వందల ఫోన్లు చేస్తోందని ఆయన భార్య మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.