ఈ మధ్య కాలం లో ప్రేమ అనేది ప్రాణాలు పోవడానికి కేరాఫ్ అడ్రస్ గా మారి పోతుంది. కొన్ని సందర్భాల్లో ప్రేమించిన వాళ్ళు మోసం చేశారని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి కొన్ని సందర్భాల్లో పరువు హత్యల పేరుతో సొంత తల్లి దండ్రుల ప్రాణాలు తీస్తున్నారు. ఇలా ఏదో ఒక విధంగా ప్రేమ అనేది చివరికి ప్రాణాలు పోవడానికి దారి తీస్తోంది.  ఇలాంటి ఘటనలు రోజు రోజుకు ఎక్కువై పోతున్నాయి.ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది.  కూతురి ప్రేమ వ్యవహారం తెలిసి ఆ తల్లిదండ్రులు తట్టుకోలేక పోయారు.


 ప్రేమించింది అన్న కారణం తో కూతురి పై ప్రేమ పగగా మార్చుకున్నారు.  అల్లారు ముద్దుగా పెంచుకున్నా కూతురు విషయం లో కాస్త అయినా జాలి చూపించ లేకపోయారు తల్లి దండ్రులు. చివరికి రక్తం పంచుకుని పుట్టిన కన్నకూతురిపైనే పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన వైయస్సార్ జిల్లాలోని రాయచోటిలో వెలుగులోకి వచ్చింది.  రాయచోటికి చెందిన యువతి అదే ప్రాంతానికి చెందిన యువకుడిని ప్రేమించింది. ఇటీవలే ఆ యువతి ప్రేమ విషయం ఇంట్లో తెలిసింది. దీంతో యువతికి పెళ్లి చేయాలని భావించారు తల్లిదండ్రులు   ప్రియున్ని పెళ్లి చేసుకోవాలనుకున్న యువతి ఎన్ని సంబంధాలు వచ్చినా చెడగొడుతు వచ్చింది.



 దీంతో కుటుంబ సభ్యులకు యువతికీ మధ్య తరచూ గొడవలు జరగడం మొదలయ్యింది. మరోసారి ఇటీవలే పెళ్లి చేసుకోవాలంటూ కుటుంబసభ్యులు యువతిపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో మరోసారి గొడవ జరిగింది.  కూతురు తీరుతో ఆగ్రహనికి గురైన తల్లిదండ్రులు, సోదరుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారూ. మంటల్లో కాలిపోతున్న యువతి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి మంటలు ఆర్పేశారు. ఇక అప్పటికే తీవ్రంగా కాలిపోయిన యువతి ప్రస్తుతం రిమ్స్ లో చికిత్స పొందుతోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: