ఒకప్పుడు హిజ్రాలు అంటే ఎంతో మర్యాదను ఇచ్చేవాళ్ళు.. అర్ద నాదీశ్వరులు.. సాక్షాత్ పరమ శివుని అవతారం అని నమ్మేవాళ్ళు. అందుకే ఏదైనా వ్యాపారం చేసినప్పుడు వారితో బోణి కొట్టిచ్చేవాళ్ళు. ప్రత్యేక పూజలు చేసేవాళ్ళు. ఇప్పుడు వారికున్న గౌరవాన్ని వాళ్ళే పోగొట్టుకుంటున్నారు. డబ్బుల కోసం జనాలను డిమాండ్ చేస్తున్నారు. లేదంటే నడి రోడ్డుపైనే బట్టలను విప్పేసి అరాచకాలను చేస్తున్నారు. ఇక హైదరాబాద్ లో హిజ్రాల గురించి చెప్పాలంటే మాటలు లేవు.. మాట్లాడుకోవడం లేదు..


ఏదైనా కార్యక్రమం ఓపెనింగ్ కు పిలిస్తే నానా హంగామా చేస్తారు. డాబులు కావాలని గోల చేస్తున్నారు.లేదంటే నలుగురిలో బట్టలు విప్పేస్తున్నారు. తాజాగా పోలీస్ స్టేషన్ లోనే ఇలాంటి వింత ఘటన చోటు చేసుకుంది. నేరేడ్‌మెట్‌ ప్రాంతంలో కొందరు హిజ్రాలు బీభత్సం సృష్టించారు. పెళ్లి ఇంట్లో బట్టలు విప్పేసి నానా రభస చేసారు. ఈ విషయం పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వాళ్ళు కూడా అక్కడకు వచ్చారు. అయిన వారిని కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు.


వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో పెళ్ళికి  వాళ్ళు  వెళ్లారు. అయితే 50 వేలు డబ్బులు కావాలని డిమాండ్ చేసారు. దానికి వాళ్ళు ఇవ్వనని చెప్పడంతో ఆగ్రహం తో ఊగిపోయారు. నోటికి  ఎంత వస్తే అంత బాండ బూతులు తిట్టారు. పెళ్ళికి వచ్చిన వారిపై అసభ్యంగా ప్రవర్తించారు. బట్టలు విప్పేసి రచ్చ చేశారు. ఈ ఘటనను పోలీసులకు చెప్పారు. వారు వెంటనే అక్కడకు చేరుకొని అదుపుచేసే ప్రయత్నం చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే హిజ్రాలు పోలీస్ స్టేషన్‌లో సైతం వీరంగం సృష్టించారు. పోలీసుల ఎదుటనే బట్టలు విప్పేసి నగ్నంగా నిలబడ్డారు. పోలీసులు హిజ్రాలపై ఐపీసీ 506, 448 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ లో రచ్చ చేసినందుకు మరో కేసును నమోదు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: