చివరికి తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి వీరంగం సృష్టించాడు. ఇక చివరికి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఈ ఘటన. కడపనతం గ్రామానికి చెందిన చాంద్ భాష పని పాట లేకుండా జులాయిగా తిరిగే వాడు. ఈ క్రమంలోనే అతని కన్ను కాస్త పక్కింట్లో ఉండే యువతిపై పడింది. ఇక ఆ యువతి తో ప్రేమాయణం సాగించాలి అనుకున్నాడు. కొన్ని రోజుల పాటు ప్రేమించాలి అంటూ యువతి వెంటపడ్డాడు. అయితే తనకు ఇష్టం లేదని యువతి ఎన్ని సార్లు తిరస్కరించినా వినిపించుకోలేదు.
తనను ప్రేమించాల్సిందే అంటూ పట్టుబట్టడంతో పాటు ఓ రోజు ఫోన్ నెంబర్ ఇవ్వాలంటూ అడుగగా యువతి నిరాకరించింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో యువతి తల్లి ఇక చాంద్ పాషా ఇంటికి వెళ్లి అందరి ముందే హెచ్చరించింది. ఊరి పెద్దలకు సైతం ఫిర్యాదు చేసింది. దీంతో వారిపై కక్ష కట్టిన చాంద్ భాషా ఇటీవలే నాటు తుపాకితో వచ్చి వీరంగం సృష్టించాడు. అయితే యువతీ కుటుంబీకులకు గురిపెట్టి కాల్చాడు. అదృష్టవశాత్తు బుల్లెట్ తలుపు కు తగిలి తలుపు ధ్వంసమైంది. దీంతో భయాందోళనకు గురైన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు.