పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుంజాన్, సచిన్లు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. భర్యాభర్తలిద్దరూ గురుగ్రామ్లోని సెక్టార్ 7లోని భవనంలో నివాసం ఉంటున్నారు. ఇక గుంజాన్ తమ్ముడు కూడా అదే భవనంలో నివాసం ఉంటున్నాడు. ఇక సచిన్ గురుగ్రామ్లోని ఓ ఐటీ సంస్థలో పనిచేస్తున్నాడు. అలాగే గుంజాన్ ఓ ఎక్స్పోర్ట్ హౌస్లో పనిచేస్తుంది. వీరిద్దరికి 11 ఏళ్ల కూతురు, 8 ఏళ్ల కొడుకు ఉన్నారు. అయితే సచిన్ పనిలో పడి ఫ్యామిలీకి చాలా తక్కువ సమయం కేటాయించడంతో భర్యాభర్తలిద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉండేవి.
అయితే దంపతుల మధ్య ఆలా గొడవ మొదలైంది. ఇక గొడవ జరుగుతున్న సమయంలో కిచెన్లోకి వెళ్లి కత్తిని తీసుకొచ్చిన గుంజాన్.. తాను పొడుచుకుని చనిపోతానని బెదిరించారు. ఈ భార్య దగ్గర నుండి కత్తిని చేసుకునే తరుణంలో కత్తి సచిన్ ఛాతిలో దిగడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇక సచిన్ ఇంట్లో నుండి కేకలు రావడంతో అతడి తమ్ముడు పైకి వెళ్లి చూశాడు. ఇక రక్తపుమడుగులో పడి ఉన్న అన్నను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సచిన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనను మొత్తం వారి కూతురు దగ్గరుండే చూసింది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. సచిన్ తమ్ముడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాపు చేపట్టారు.