అతను న్యాయవాది. పదిమందికి న్యాయం చేయాల్సిన అతనే ఈ పాడు పనికి పాల్పడ్డాడు. కామంతో కళ్లు మూసుకుపోయి కర్కశంగా మారాడు. తల్లి లాంటి న్యాయదేవతకే కన్నీళ్లు చెప్పించాడు. చివరికి విషయం బయటపడడంతో కటకటాల పాలయ్యారు. దేశంలో మహిళలపై రోజురోజుకు  హత్యలు, అత్యాచారాలు, బెదిరింపులు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన, ఎన్ని శిక్షలు వేసినా ఇలాంటి మృగాళ్లు మాత్రం మార్పు రావడం లేదని చెప్పవచ్చు. రోజుకు దేశంలో ఎన్నో సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి. ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడు తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన న్యాయం చేసే న్యాయవాద వృత్తిలో ఉన్న  వ్యక్తి చేసిన పాడు సంఘటన.. అది ఏంటో తెలుసుకుందాం.. వివరాల్లోకి వెళితే..

 అతను న్యాయవాది. విడాకుల కోసం అతని దగ్గరికి ఒక మహిళ వచ్చింది. ఆ వ్యక్తి ఆమెపై అత్యాచారం చేసి నగ్న ఫోటోలు తీసి  బ్లాక్ మెయిల్ చేశాడు. చివరకు పోలీసుల చేతికి చిక్కి జైలు పాలయ్యాడు. తిరువల్లూరు ప్రాంతంలోని మనవాలానగర్ కు చెందినటువంటి వివాహిత విడాకుల కోసం అని  తిరువల్లూరు జిల్లాలోని కోర్టులో పని చేస్తున్నటువంటి న్యాయవాది డార్జాన్ 44 సంవత్సరాల వ్యక్తిని కలిసినది. ఈ కేసుకు సంబంధించి నటువంటి  ఆధార పత్రాలను  ఆమె ఇంటికి వచ్చి తీసుకుంటానని సదరు న్యాయవాది చెప్పాడు. ఆ మరుసటి రోజు ఆ మహిళ వెళ్లిన  డార్జాన్  జ్యూస్ లో నిద్రమాత్రలు కలిపి ఆమెకు ఇచ్చేసాడు. దీంతో ఆమె తీవ్రమైన నిద్ర లోకి వెళ్ళగానే  ఆమెపై అత్యాచారం చేసి, నగ్న ఫోటోలను తమ మొబైల్ ఫోన్లలో తీశాడు. ఆ తర్వాత ఆమె నిద్ర నుంచి తేరుకొని జరిగిన విషయాన్ని గమనించిన ది.


ఈ విషయంపై న్యాయవాదిని అడగగా అతని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమె నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ ఏడు లక్షల రూపాయలు వసూలు చేశారు. పలుమార్లు ఆమెపై అత్యాచారం కూడా చేశాడు. దీంతో విసుగు చెందిన ఆమె తిరువల్లూరు మహిళా కోర్టులో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కొడైకెనాల్ లో ఉన్నటువంటి డార్జాన్ ను అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరచి, తర్వాత పూలల్ జైలుకు పంపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: