ప్రేమ..  ఒక మధురమైన అనుభూతి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగుల్చుతు ఉంటుంది.. ఇక ప్రతి ఒక్కరిలో ప్రేమ పుట్టడం సర్వసాధారణమే. అయితే కొంతమంది ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవడానికి  ఎంతో పోరాటం చేస్తూ ఉంటారు  మరి కొంతమంది ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవడం మనకి రాసి పెట్టి లేదులే అనుకొని సర్దుకుపోతూ ఉంటారు  కానీ ఇటీవలి కాలంలో మాత్రం ప్రేమించిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  ఇలా నేటి రోజుల్లో ప్రేమ అనేది ప్రాణాలు పోవడానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.



 ఎంతోమంది యువతీ యువకులు ప్రేమించిన సమయంలో సంతోషంగానే ఉంటున్నారు  కానీ తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రుల దగ్గర చెప్పడానికి మాత్రం భయపడిపోతున్నారు. ఇక తల్లిదండ్రులు తమ పెళ్ళికి ఒప్పుకోరు అని భయపడి చివరికి కఠిన నిర్ణయం తీసుకుంటున్నారు. జీవితంలో ఎలాగో కలిసి ఉండలేకపోతున్నాము చివరికి చావులో అయిన కలిసి ఉందాం అని ఎంతోమంది బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్నాయి. ఇలా ప్రేమజంటలు క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ఎన్నో కుటుంబాలు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లల్ని దూరం చేసుకుంటున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.


 ఆ ఇద్దరి ప్రాణం పోవడానికి ప్రేమ కారణం అయ్యింది. ఇటీవలే కర్నూలులో ఆ ప్రేమజంట ఆత్మహత్యయత్నం చేసింది. ఇక వీరిలో ఒకరు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తెలంగాణలోని గద్వాల్ జిల్లా గుట్టు మండలానికి చెందిన అల్లాబాకాష్ అనే యువకుడు భార్గవి అనే యువతి ప్రేమించుకున్నారు. ఇక ఇటీవలే పెళ్లి చేసుకోవాలని భావించారు.  వారి ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పారు. అయితే భార్గవి తల్లిదండ్రులు వివాహానికి ఒప్పుకోలేదు అల్లాబాకాష్ అనే యువకుడికి గతంలోనే వివాహం జరిగిందని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇక యువతీ యువకులు మాత్రం ఒకరిని విడిచి ఒకరు ఉండలేక పోయారు. చివరికి ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. ఇక ఆ తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేయగా ఇక ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలోనే భార్గవి మృతి చెందింది. ప్రస్తుతం అల్లాబాకాష్ పరిస్థితి విషమంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: