అక్రమ సంబంధం కారణంగా తన మరదలిని హత్య చేసిన ఘటన కేరళలో చోటు చేసుకుంది. దీ ఘటన అలప్పుజాలో తీవ్ర కలకలం రేపింది. హత్యగా నిర్ధారణ చేసిన పోలీసులు.. యువతిని చంపిన ఆమె అక్క కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు అతడిని పట్టుకుని విచారణ చేపట్టారు. అయితే విచారణలో షాకింగ్ విషయాలు బయట పడ్డాయి. ఆ యువతిని తానే చంపినట్లు ఆమె అక్క భర్త ఒప్పుకున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని చెర్తాలా కడక్కరపల్లిలో నివాసముంటున్న ఉల్లాస్, సువర్ణల కుమార్తె హరికృష్ణ (25). ఈమె వందనమ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో కాంట్రాక్ట్ నర్సుగా పనిచేస్తోంది. హరికృష్ణ అక్క కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తోంది. అయితే శుక్రవారం నైట్ డ్యూటీ ఉండటంతో హరికృష్ణ అక్క విధులకు వెళ్లింది. దీంతో హరికృష్ణను అక్క భర్త రతీష్ ఇంటికి వచ్చి పిల్లలను చూసుకోవడానికి ఇంటికి తీసుకెళ్లాడు. దీంతో హరికృష్ణ.. తన బావ రతీష్‌‌తో కలిసి ఇంటికి వెళ్లింది. రాత్రి ఏం జరిగిందో తెలియదు.. తెల్లవారే సరికి హరికృష్ణ శవమై తేలింది. రతీష్ కూడా పరారీలో ఉన్నట్లు తేలింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

రతీష్‌ను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు విచారణ చేపట్టారు. అయితే విచారణలో షాకింగ్ నిజాలు వెల్లడించడంతో పోలీసులు షాకయ్యారు. హరికృష్ణతో తనకు అక్రమ సంబంధం ఉన్నట్లు రతీష్ పేర్కొన్నాడు. అయితే ఇటీవల ఆమె మరొకరితో సంబంధం పెట్టుకున్నట్లు తెలిపాడు. వారిద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయంలో హరికృష్ణకు, తనకు గొడవైనట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే గొడవ పెద్దది కావడంతో ఆమెపై దాడికి దిగాడు. దీంతో ఆమె మరణించినట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు రతీష్‌ను కస్టడిలో తీసుకున్నారు. అక్రమ సంబంధాలకు పాల్పడుతూ ప్రాణాలు కోల్పోతున్న వారు అధికమవుతున్నారని, బంధాలను కాపాడుకోవాలని పోలీసులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: