నేటి రోజుల్లో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా దారుణమైన శిక్ష విధించిన కామాంధుల తీరులో  మాత్రం మార్పు రావడం లేదు  రోజురోజుకు రెచ్చిపోతున్న కామాంధులు ఆడపిల్లల జీవితాన్ని ప్రశ్నార్థకం గా మార్చేస్తూనే ఉన్నారు. దీంతో ఆడపిల్ల ధైర్యంగా బయట తిరగలేని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం. అయితే కేవలం ఆడపిల్లలకు మాత్రమే కాదు అటు చదువుకుంటున్న బాలురకు సైతం రక్షణ లేదు అన్న విషయానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 ఎంతో మంది కామాంధులు ఏకంగా బాలుర పై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మరికొన్నిసార్లు ఏకంగా మహిళలు కూడా స్కూల్ విద్యార్థుల పై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. మూడో తరగతి చదువుతున్న బాలుడుపై కన్నేసి.. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడింది మహిళ. ఈ ఘటన హైదరాబాద్లోని చంద్రయాన్ గుట్ట పరిధిలో వెలుగులోకి వచ్చింది. బార్కాస్ లోని లయోల మోడల్ స్కూల్ లో జ్యోతి అనె 20 ఏళ్ల యువతి ఆయాగా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే కామంతో ఊగిపోయిన  ఆ యువతి కన్ను మూడో తరగతి చదువుతున్న  బాలుడి పై పడింది  ఇక అతడు బాత్రూం లోకి వెళ్ళగానే వెనకాలే వెళ్లి లైంగిక దాడికి పాల్పడింది. అంతటితో ఆగకుండా ఎవరికీ చెప్పొద్దూ అంటూ సిగరెట్ మరియు లెటర్స్ తో బాలుడు చేతి కాలిపై కూడా కాల్చేది.



 ఇక భయపడిపోయిన బాలుడు ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదు. అయితే బాలుడు చేతులు కాళ్లపై కాల్చిన గాయాలు చుసిన తల్లి ఏం జరిగింది అని అడుగగా అసలు విషయాన్ని బయట పెట్టాడు. దీంతో అవాక్కయిన బాలుడు తల్లిదండ్రులు వెంటనే చంద్రయన్గుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక నిందితురాలు పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు  అయితే పక్కా ఆధారాలతో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా.  అన్ని ఆధారాలను పరిశీలించిన కోర్టు ఆమె ను దోషిగా నిర్ధారించి 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. అంతే కాదు పది వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: