అయితే చాలా మంది ఇక ఈ రివార్డు ప్రకటన తర్వాత రాజు ఆచూకీ కోసం వెతకడం కూడా ప్రారంభించారు. చివరికి ఇటీవల ఏకంగా రైలు పట్టాలపై నిందితుడు రాజు విగతజీవిగా కనిపించాడు. పోలీసులకు దొరికి పోతాను అని భావించి చివరికి ఆత్మహత్య చేసుకున్నట్లు అందరు అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే నిందితుడు రాజును పట్టుకునేందుకు పోలీసులు ప్రకటించిన పది లక్షల రివార్డు పోలీసులనే తీవ్ర ఇబ్బందులు పెట్టినట్లు తెలుస్తోంది రాజు ఆచూకీ చెప్పాలి అంటూ రివార్డు ప్రకటిస్తూ 2 నెంబర్లను సూచించారు పోలీసులు.
ఇక ఈ నెంబర్లకు ఎంతో మంది కేటుగాళ్లు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.. మీరు రాజు కోసం వెతుకు తున్నారు కదా సార్.. రాజుని నేను ఇప్పుడే చూశాను.. నా పక్కనే ఉన్నాడు.. నాకు 10 లక్షలు ఇస్తారు కదా సార్ అంటూ ఎంతోమంది కేటుగాళ్లు ఫేక్ కాల్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఏకంగా పోలీసులు సూచించిన నెంబర్ లకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు వేల కాల్స్ వచ్చాయట. మొదట ఇలా వచ్చిన కాల్స్ కి సీరియస్గానే స్పందించిన పోలీసులు ఆ తర్వాత ఇక కాల్స్ ఫేక్ అని భావించారట.