హైదరాబాద్ ముషీరాబాద్ లో మరో మైనర్ బాలిక పై అత్యాచారం యత్నానికి ఒడి గట్టాడు ఓ కిరాతకుడు.  పార్సి గుట్ట లో చాక్లెట్ కోసం వెళ్లిన 7 ఏళ్ల చిన్నారి పై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు  నిందితుడు.   నిందితుడు సీతాఫల్ మండి కి చెందిన లెబర్ నర్సింహ గా గుర్తించారు.   రోడ్డు  పక్కన నిల్చున్న ఆటో పక్క కు తీసుకెళ్లి అఘాయిత్యం చేయబోయాడు  నిందితుడు లెబర్ నర్సింహ.  చేతులు కట్టేసి, నోరు మూసిన నిందితుడు  లెబర్ నర్సింహ.. అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.  

అయితే పాప గట్టి గా కేకలు వేయడం తో ఘటన స్థలానికి చేరుకున్నారు  బస్తి వాసులు.   దీంతో బస్తి వాసులను చూసి పారిపోయే ప్రయత్నం  చేశాడు  నిందితుడు లెబర్ నర్సింహ.  అయితే ఎంతో చాక చాఖ్యం తో నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు స్థానికులు.  దేహశుద్ధి చేసిన అనంతరం.. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు బస్తి వాసులు. దీంతో రంగం లోకి దిగిన పోలీసులు.. నిందితుడు లెబర్ నర్సింహ పై కేసు నమోదు చేశారు. నిందితుడు లెబర్ నర్సింహ పై 366,354,352A, పొక్సో ఆక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు.

పోలీస్ స్టేషన్ కు తీసుకువెల్లిన పోలీసులు... నిందితుడు పై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ ఘటనపై ఆ బస్తీవాసులు తీవ్రస్థాయిలో నిందితుడిపై మండిపడ్డారు. ఇలాంటి కొంతమంది దుర్మార్గుల కారణంగా.. అందరికీ చెడ్డపేరు వస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి నిందితులకు ఉరిశిక్ష వేయడం అసలైన శిక్ష అని స్పష్టం చేశారు బస్తీవాసులు. ఇలాంటి వారికి కఠిన శిక్షలు అమలు... ఇంకెవరు ఇలాంటి ఘటనలు చేయరని స్థానికులు చెప్పారు. కఠిన శిక్షలు అమలు చేయకపోతే ఇలాంటి ఘటనలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు బస్తీవాసులు. ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: