ఈ ఘటనను ఎవ్వరూ అసలు ఊహించరు. అనుకోకుండా అకస్మాత్తుగా జరిగిన ఘటన ఇదని పలువురు చర్చించుకుంటున్నారు. నిన్న రాత్రి అకస్మాత్తుగా తిరుపతిలో భారీ వర్షం కురిసినది. రాత్రి కురిసిన వర్షానికి వెస్ట్ చర్చీ బ్రిడ్జ్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. దాదాపు 7 నుంచి 8 అడుగుల వరకు నీరు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే కర్నాటక నుంచి ఏడుగురు భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చారు. తిరుమలకు వస్తున్న సమయంలో రోడ్డుమీద మొత్తం నీరు నిలిచాయి. నీరు ఎంత లోతు ఉన్నాయనే విషయాన్ని డ్రైవర్ అంచెనా వేయకపోవడంతో వెళ్తున్న క్రమంలోనే నీటి మధ్యలోనే వాహనం ఇరుక్కుపోయింది. దీని కారణంగా లోపల ఉన్నటువంటి ఏడుగురు భక్తులలో అతికష్టం మీద ఆరుగురు బయటికి వచ్చారు. అందులో సంధ్య మృతి చెందింది. చీర పట్టుకొని కారులోంచి ఐదుగురు బయటికి వచ్చారు. ఇద్దరు మాత్రం రాలేకపోయారు.
రాలేకపోయినవారిలో సంధ్య ఊపరిఆడకపోవడంతో మృతి చెందింది. మరొక చిన్నారి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నది. తిరుపతిలోని రియా ఆసుపత్రిలో చిన్నారి చికిత్స పొందుతున్నది. కారులో ఇరుక్కుపోయిన ఏడుగురిలో ఆరుగురు చికిత్స పొందారు. వారిలో చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు కూడ ధృవీకరించారు. వారు మీడియాతో కూడ మాట్లాడారు. రాత్రి కారు నీటిలో ఇరుక్కుపోయినప్పుడు ఎవరూ కూడ కాపాడడానికి రాలేదని.. డ్రైవర్ పరారయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. కాసేపటిలోనే తిరుమల శ్రీవారిని దర్శించుకుంటామనే ఆనందంతో ఉన్న మాకు ఈ విధంగా జరగడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. సాధారణంగా వెస్ట్ చర్చీ బ్రిడ్జ్ 7 అడుగుల పొడవు ఉంటుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకుందామమని వచ్చిన భక్తులకు పెనువిషాదం మిగిలిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.