శుక్రవారం రెండో రౌండ్ విచారణకు హాజరు కావాల్సిందిగా ఆమెను కోరగా దాదాపు నాలుగు గంటల పాటు గ్రిల్ చేశారు. సమాచారం మేరకు.. ఎన్సిబి అధికారులు శుక్రవారం అనన్య పాండేని విచారించినప్పుడు ఆధారాలు కనుగొనలేకపోయారు మరియు అందుకే ఆమెకు సోమవారం మళ్లీ సమన్లు వచ్చాయని తెలుస్తోంది. గతంలో విచారణ సమయంలో ఆర్యన్ ఖాన్తో చాటింగ్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్యన్తో డ్రగ్స్ విషయంలో జోక్ చేశానని అనన్య చెప్పినట్టు తెలిసింది.
అయితే, ఆర్యన్ ఖాన్కు డ్రగ్స్ ఎవరు పరిచయం చేశారు అనే అంశం విచారణ సాగుతోంది. దీంతో ఆ విషయంలో ప్రముఖంగా వినిపించిన పేరు అనన్య పాండేది కావడంతో.. తాజాగా నేడు అనన్య పాండేను ఎన్సీబీ విచారిస్తోంది. అయితే, ఆర్యన్తో అనన్య పాండే జరిపిన వాట్సప్ చాట్ గురించి నిఘా పెట్టిన పోలీసులు మరోసారి ఆమెను ప్రశ్నిస్తున్నట్టు సమచారం. కానీ, ఎంత అడిగిన అనన్య మాత్రం ఒకే విధంగా సమాధానం ఇస్తుందని తెలుస్తోంది.
తన జీవితంలో ఎన్నడూ డ్రగ్స్ తీసుకోలేదని ఆర్యన్ కేవలం డ్రగ్స్ విషయంలో జోక్ చేశానని చెబుతున్నట్టు సమచారం. డ్రగ్స్ వ్యవహారంలో జోక్ చేసిందా లేదా అసలు ఎందుకు చాట్ చేసిందని విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మొత్తానికి ఈ డ్రగ్స్ వ్యవహారంలో తెలిసో తెలియకుండాఏ అనన్య పాండే ముఖ్యపాత్ర పోషించినట్టుగా కనిపిస్తోంది.