ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి లో చోటుచేసుకుంది. డైలీ మార్కెట్ ప్రాంతం లో నివాసం ఉంటున్న నర్రు చిన్నబాబు ,రౌతు వందన ఇంటి ముందు నివాసముండేవాడు. ఈ క్రమం లోనే చినబాబు ఆమెను చూసి మోజుపడ్డాడు ఎలాగైనా సరే ఆమెను పొందాలనుకున్నాడు. అయితే వెంటనే మాస్టర్ ప్లాన్ అమలు చేశాడు. ఆమెను ప్రేమ పేరుతో లొంగదీద్దాం అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆమెను ప్రేమ లోకి గుంజాడు . ఆమెను ప్రేమిస్తున్నట్లు నమ్మించాడు. నిజమేమో అని అని నమ్మిన వందన అతడిని ప్రేమించింది. ఈ క్రమంలోనే వందన గర్భవతి అయ్యింది. దింతో చినబాబుకు పెళ్లిచేసుకోమని నిలదీసింది. దాంతో చినబాబు ప్లేటు ఫిరాయించాడు ..కులం సాకుచెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
కానీ వందన అతడిని ఘాడంగా ప్రేమించడంతో అతడిని వదులుకోలేక జరిగిన విషయాన్నీ పెద్దలో పెట్టి న్యాయం జరపాలని కోరింది. పెద్దలు వారికీ చీవాట్లుపెట్టి జూన్ 20న అమ్మవారి ఆలయంలో వివాహం జరిపించారు. వందన మాదిగ కులానికి చెందింది కావడంతో చినబాబు తల్లితండ్రులు వారిని ఇంట్లోకి రానివ్వలేదు. ఈ క్రమంలోనే ఇద్దరు భార్యాభర్తలు వందన అన్న ఇంట్లో అద్దెకు వెళ్లారు. అయితే పెళ్ళైన 10 రోజులకే అనగా జూన్ 20న చినబాబు ఇంటినుండి పరారయ్యాడు. వెంటనే వందన అతడిపై మిస్సింగ్ కేసు నమోదు చేసింది .
ఇప్పటికి ఐదు నెలలు కావస్తూవుండడంతో వందన తన అత్తమామలను నిలదీసింది కానీ వారు చెప్పే సమాధానం ఎటుపొంతన కాకపోవడంతో తన అత్తమామలు అతడిని ఎక్కడో దాచిపెట్టారని భావించి అతన అత్తామామలపైకూడా కేసు పెట్టి వారి ఇంటిముందు భైటాయించింది. ఈ నేపథ్యంలో ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు స్పందించారు పెట్టిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుని నమోదు చేశామన్నారు. కేసు పెట్టినప్పటినుండి అతడి కోసం గాలిస్తున్నామన్నారు.