భార్య భర్తల బంధం లో రోజురోజుకు అన్యోన్యత కరువు అవుతుంది  అన్నది నేటి రోజుల్లోవెలుగులోకి వస్తున్న ఘటనల చూస్తే అర్థమవుతుంది. ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమతో ఉండాల్సిన భార్యాభర్తలు బద్ద శత్రువులుగా మారి పోయి తరచూ గొడవలు పడటం లాంటివి చేస్తున్నారు. అంతేకాదు చిన్న చిన్న గొడవలకి కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఏకంగా బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇలా భార్య భర్తల బంధం లోకి అడుగుపెట్టిన ఎంతో మంది యువతీ యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదా కట్టుకున్న వారిని దారుణంగా హత్య చేసి జైలుకు వెళ్లడం లాంటివి జరుగుతున్నాయి.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య వేధింపులు తాళలేక పోయిన భర్త ఎంతో మనస్థాపం చెందుతూ వచ్చాడు. తల్లి లాగా చూసుకుంటుంది అన్న భార్య చిత్రహింసలకు గురి చేయడంతో జీవితం అక్కడితో ముగిసిపోయింది అని భావించాడు. రోజురోజుకు వేధింపులు ఎక్కువవడంతో ఇక చావే శరణ్యమని భావించి చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతకుముందు  ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.


 వివరాల్లోకి వెళితే... షేక్ పేట కు చెందిన సంతోష్ అనే వ్యక్తి ఎంబీఏ చదివాడు. ఇక ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ అమెరికా లో ఉద్యోగం చేస్తున్నాడు సదరు వ్యక్తి. ఇతనికి 2013లో ఫలక్నుమా కు చెందిన యువతితో పెళ్లి జరుగగా వీరిద్దరికీ ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కొన్నాళ్ళ వరకు సాఫీగా సాగిపోతున్న వీరి సంసారంలో మనస్పర్ధలు మొదలయ్యాయ్. దీంతో గత కొంతకాలం  నుంచి ఏదో విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరుగుతూనే ఉంది. ఇటీవలే భార్య తీరుతో మనస్తాపం చెంది భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఒక వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన చావుకు భార్య,అత్తమామలు, బామ్మర్ది, చిన్న మామ కారణం అంటూ వీడియో ద్వారా తెలిపాడు. నన్ను క్షమించండి ఎంతో జీవితాన్ని చూడాలి అనుకున్న కానీ చావక తప్పడం లేదు. నా కొడుకునూ ఉన్నత స్థితిలో ఉండేలా స్కూల్లో చేర్పించా  కానీ నా భార్య అన్నింటికి అడ్డు  పడుతుంది. అందుకే మనస్థాపంతో చనిపోతున్నాను అంటూ వీడియోలో తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: