సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం.. పేరెంట్స్ బలవంతంగా ఇష్టం లేని పెళ్లి చేస్తూ ఉంటే పెళ్లి కూతురు పెళ్లికి ఒప్పుకున్నట్లే నటించి.. చివరికి పెళ్లి బట్టలు మార్చుకోవడానికి గది లోకి వెళ్తుంది. ఇక ఆ తర్వాత అటు నుంచి అటే పారిపోతూ ఉంటుంది. ఇలాంటివి ఎక్కువగా సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ నిజ జీవితంలో అలాగే సినిమాల్లో చూపించినట్టు గా జరగడం అంటే అసాధ్యం అని చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటిదే జరిగింది. మరి కొన్ని నిమిషాల్లో పెళ్లి పీటలమీద వరుడితో తాళి కట్టించుకోవాలి ఆ యువతి. పెళ్లి బట్టలు మార్చుకోవడానికి గది లోకి వెళ్ళింది.


 కానీ మళ్ళీ తిరిగి రాలేదు.. వెళ్లి చూస్తే తలుపు తెరవలేదు. తలుపులు బద్దలు కొట్టి చూస్తే లోపల వధువు లేదు. దీంతో అందరూ  ఒక్కసారిగా షాకయ్యారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో అని అందరూ టెన్షన్ పడుతున్న సమయంలో ప్రియుడిని గుడిలో పెళ్లి చేసుకుంది ఆ యువతి. ఈ ఘటన మదనపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తట్టి వారి పల్లెకు చెందిన సోనికకు పట్టణంలోని సొసైటీ కాలనీకి చెందిన యువకుడితో వివాహం చేయడానికి నిశ్చయించారు తల్లిదండ్రులు. ఈ క్రమంలోనే శని ఆదివారాల్లో పెళ్లి జరిగేలా పెద్దలు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు ఈ క్రమంలోనే ఇరు కుటుంబ సభ్యులందరూ పెళ్లి మండపానికి చేరుకున్నారు. సాయంత్రం  ఐదున్నర గంటలకు ముహూర్తం.



 పెళ్లి మండపం మొత్తం బాజాభజంత్రీలు బంధు మిత్రులతో పూర్తిగా సందడిగా  మారిపోయింది. ఈ క్రమంలోనే ముహూర్తం మరి కొన్ని నిమిషాలు ఉంది అనగా పెళ్లి చీర కట్టుకునేందుకు యువతి గదిలోకి వెళ్ళింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. ఏం జరిగిందనే కుటుంబ సభ్యులందరూ వెతకడం ప్రారంభించారు. చివరికి మరునాడు రోజు ఉదయం రోజున తన ప్రియుడు చరణ్ తో పుంగనూరు కి వెళ్లి ఒక గుడిలో వివాహం చేసుకుంది.  కుటుంబసభ్యుల నుంచి ప్రమాదం ఉందని పోలీసులను ఆశ్రయించింది పెళ్లి ఏర్పాట్ల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టామని.. తమకు అవమానం జరిగింది అంటూ పెద్దలతో కలిసి టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: