దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంటే ఇంకా చాలామంది క్షుద్రపూజలు మూఢనమ్మకాల పేరుతో  ఇంకా అనాగరిక సమాజంలోనే బ్రతుకుతున్నారు. దీంతో ఇలా క్షుద్ర పూజల పేరుతో ఇప్పటికే దారుణ ఘటన వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అంతేకాదు క్షుద్ర పూజలుహత్యలకు పాల్పడుతు చివరికి జైలు పాలు అవుతున్న ఘటనలు కూడా అందరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవలే ఫయినా బాగ్ లో యువకుడి హత్య కేసు మిస్టరీ గా మారిపోయింది. కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు ఏకంగా నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.


 అయితే హంతకులలో  హత్యకు గురైన యువకుడి సొంత బావ కూడా ఉండటం గమనార్హం. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది. ఫయినా బాగ్ కు చెందిన మహ్మద్ అలీ అనే వ్యక్తి ఓ యువతిని జనవరి నెలలో ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు. అయితే వీరి వివాహ నిశ్చయం అయినా నాటి నుంచి తరచూ యువతి అనారోగ్యం బారిన పడుతూ వస్తోంది. ఇక డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లినా కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో ముంబైలో ఉన్న ఒక బాబా దగ్గరికి ఆమెను తీసుకెళ్లారు. దీంతో కుటుంబ సభ్యులే యువతి క్షుద్ర పూజలు చేయించారు అంటూ బాబా చెప్పాడటా.



 దీంతో అయోమయంలో పడిపోయాడు ఆరిఫ్ షాహీ నగర్ లో నివసించే తన సోదరి తనకు కాబోయే భార్యకు క్షుద్ర పూజలు చేయిస్తున్నారు అని అనుమాన పడటం  మొదలెట్టాడు. ఈ క్రమంలోనే ఇదే విషయంపై సోదరి తో పాటు హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా ఆమె భర్త మహ్మద్ షమి తో గొడవ పడటం మొదలు పెట్టాడు. తనకు కాబోయే భార్య కు చికిత్స చేయడానికి రెండు లక్షలు ఇవ్వాలని డిమాండ్.. చేయగా 50 వేలు ఇచ్చారు. అయినప్పటికి వారిపై ఒత్తిడి తీసుకు రావడం మొదలు పెట్టాడు.  దీంతో సొంత బావమరిదిని చంపేందుకు సిద్ధమయ్యాడు బావ. స్నేహితులతో కలిసి దారుణంగా గొడ్డలితో దాడి చేసి పరారయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు దుర్మరణం చెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: