నేటి రోజుల్లో మనిషి ఆలోచనా తీరులో దారుణమైన మార్పులు వస్తున్నాయి. బంధాలకు బంధుత్వాలకు ఆస్తులు విలువ ఇవ్వడం లేదు మనిషి. మానవతా విలువలను పూర్తిగా మరచిపోతున్నాడు. ఆస్తుల కోసం చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు. మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనిషి.. అడవిలో ఉండే మృగం కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. ఇలా నేటి సభ్యసమాజంలో కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయిన మనుషులు కనిపిస్తున్నారు తప్ప మానవత్వం ఉన్న మనుషులు మాత్రం కనిపించడం లేదు. ఏకంగా సొంత వారి విషయంలోనూ ఎంతో దారుణంగా వ్యవహరిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.



 ఆస్తుల కోసం ఏకంగా రక్తం పంచుకుని పుట్టిన వారిని సైతం దారుణంగా హత్య చేయడం లాంటి ఘటనలు సభ్యసమాజాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత ఏ మహిళ అయినా సరే కలకాలం పసుపు కుంకుమలతో ఉండాలి అని కోరుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం బ్రతికుండగానే భర్తను చంపేసింది. భర్త మరణించినట్లు నకిలీ ధ్రువపత్రాల ను సృష్టించింది. ఈ క్రమంలోనే భర్త పేరు మీద ఉన్న ఆస్తిని కాచేసింది. కానీ చివరికి ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు భార్యతో పాటు సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు.



 నాగర్ కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. తెలకపల్లి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దురు గ్రామానికి చెందిన రేణుక అనే మహిళ తో కలిసి ఉంటుంది. అయితే ఇటీవలే భార్య కన్ను భర్త ఆస్తి పై పడింది. దీంతో భర్త ఆస్తి కొట్టేయాలని భార్య  పన్నాగం పన్నింది. ఇక బతికుండగానే భర్త చనిపోయాడు అన్న విధంగా ధ్రువీకరణ పత్రం సృష్టించింది. దీనికోసం గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ల తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక పంచాయతీ కార్యదర్శి సందీప్ సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ ధృవీకరణ పత్రాలు సృష్టించి భర్త బీరయ్య పేరుమీద ఉన్న 1.20 ఎకరాలు భూమిని తన పేరుమీద చేయించుకుంది. అయితేఈ విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి సందీప్ తన సంతకం ఫోర్జరీ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: