భార్య భర్తల బంధం.. అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది.. అసలు సిసలైన ప్రేమకు చిరునామా గా ఉంటుంది. ఒక్కసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తర్వాత ఒకరి పట్ల ఒకరు అమితమైన ప్రేమను చూపించుకుంటూ  చివరి శ్వాసవరకు తోడునీడగా ఉండేదే భార్య భర్తల బంధం. కష్టసుఖాల్లో పాలుపంచుకుని ఎంతో సంతోషంగా జీవించడానికి ఇద్దరు యువతీ యువకులు భార్యాభర్తల బంధంలోకి అడుగు పెడుతూ ఉంటారు. అయితే ఇదంతా ఒకప్పటి మాట ఇప్పుడు మాత్రం భార్య భర్తల బంధం గురించి మాట్లాడుకోవాలి అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. వామ్మో.. నేటి రోజుల్లో మూడు ముళ్ళ బంధంతో ఒకటవుతున్న వారు అసలు భార్య భర్తల లేకపోతే బద్ధశత్రువులా అన్నది కూడా అర్థం కాని విధంగా మారిపోయింది.


 ఎందుకంటే ఏకంగా కట్టుకున్న వారికి కడవరకు తోడుండి కష్టసుఖాలను పంచుకోవాల్సిన వారు చివరికి యమకింకరులు గా మారిపోయి దారుణంగా కడ తేరుస్తున్న  ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. లేదా భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలతో మనస్థాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు కూడా ఎక్కువై పోతున్నారు. ఇలా ఇటీవలి కాలంలో ఎన్నో దారుణ ఘటన వెలుగులోకి వస్తూనే ఉన్నాయి .  భార్యాభర్తల మధ్య గొడవ జరగడం సర్వసాధారణం. ఆ చిన్నపాటి గొడవలనే పెద్దదిగా చేసుకొని చివరికి భార్యాభర్తల బంధానికి స్వస్తి పలుకుతున్నారు ఎంతోమంది.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఇప్పటివరకు కోపంలో భార్యను చంపిన భర్త గురించి విన్నాం. కానీ ఇక్కడ మాత్రం భర్తను దారుణంగా భార్య చంపడానికి ప్రయత్నించింది. ఈ ఘటన మెదక్ జిల్లాలోని జగ్గంపేట లో వెలుగులోకి వచ్చింది. నరేందర్ కాసాల గ్రామానికి చెందిన నవనీత తో వివాహం జరిగింది.. అయితే గత కొన్ని రోజుల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవల మరోసారి గొడవ జరగడం తో ఇక కోపోద్రిక్తురాలైన  భార్య ఏకంగా భర్త గొంతు కోసింది.  కాగా ప్రస్తుతం భర్త నరేందర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: