ప‌దిహేడేండ్ల బాలిక నిద్రిస్తుండ‌గా.. క‌న్న‌త‌ల్లి ఆమె చాతిమీద కూర్చొని గొంతు నులుమి.. అమ్మ అమ్మ అన్నా కానీ వ‌ద‌ల‌కుండా అమ్మ‌మ్మనేమో ఆ బాలిక‌పై దిండు గ‌ట్టిగా అదిమ ప‌ట్టింది. పేగుబంధం అని క‌నిక‌రం కూడా లేకుండా ఇద్ద‌రూ క‌లిసి ఆ బాలిక‌ను హ‌త్య చేసారు. కుమార్తె కులాంత‌ర వివాహం చేసుకుంటే ప‌రువు పోతుంద‌ని భావించిన ఆ త‌ల్లి బిడ్డ‌ను హ‌త్య‌మార్చిన ఘ‌ట‌న వ‌రంగ‌ల్ జిల్లాలో చోటు చేసుకున్న‌ది. వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో  జ‌రిగిన ఈ హత్య‌కు సంబంధించి ఈస్ట్‌జోన్ డీసీపీ వెంక‌ట‌ల‌క్ష్మీ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ప‌ర్వ‌త‌గిరికి చెందిన ఉబ్బ‌ని స‌మ్మ‌క్క‌కు ఇద్ద‌రు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం జ‌రిగింది.

 అనంత‌రం భ‌ర్త మ‌ర‌ణించ‌డంతో స‌మ్మ‌క్క కూర‌గాయలు విక్ర‌యిస్తూ జీవిస్తున్న‌ది. అయితే ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న చిన్న కుమార్తె అంజ‌లి(17) ఇదే గ్రామానికి చెందిన రాయ‌పురం ప్ర‌శాంత్‌తో ప్రేమ‌లో ప‌డిన‌ది. ఈ విష‌యం తల్లికి తెలియ‌డంతో కుమార్తెను ప‌లుమార్లు మంద‌లించిన‌ది. అయినా మార్పు రాక‌పోవ‌డంతో పెళ్లి చేసుకుంటే ప‌రువు పోతున్న‌ద‌ని భావించిన స‌మ్మ‌క్క త‌న త‌ల్లి నాము యాక‌మ్మ‌తో క‌లిసి గ‌త నెల 19న అర్థ‌రాత్రి అంజ‌లి గాఢ‌నిద్ర‌లో ఉండ‌గా ముఖంపై దిండు ఉంచి ఊపిరాకుండా చేసి హ‌త్య చేసారు. అనుమాన‌స్ప‌ద మృతి కింద కేసు న‌మోదు చేసిన పోలీసులు స‌మ్మ‌క్క‌, యాక‌మ్మ‌ల‌ను విచారించ‌గా కులాంత‌ర వివాహం చేసేందుకు ఇష్టం లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే హ‌త్య చేసామ‌ని ఒప్పుకున్నారు.

కంప్యూట‌ర్ కాలంలో కూడా కులాల కోసం కొట్లాట‌లే కాదు, క‌న్న బిడ్డ‌ల‌ను క‌సాయిలా చంపేస్తున్నారు. పెళ్లి చేసుకున్న కూతుళ్ల‌ను క‌డ‌తేరుస్తున్న దారుణ సంస్కృతి రోజు రోజుకు పెరుగుతూనే ఉన్న‌ది. అటువంటి ప‌రువు హ‌త్య‌నే వ‌రంగ‌ల్ జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. అయితే మ‌ఖ్యంగా మ‌నుమ‌రాలు అని చూడ‌కుండా అమ్మ‌మ్మ, క‌న్న కూతురు అని చూడ‌కుండా త‌ల్లి కూతురు ఉసురును తీసారు. ప్రేమించిన పాపానికి త‌ల్లిదండ్రులు ఇలా చేయ‌డం ఏమిట‌ని వ‌రంగ‌ల్‌లో స్థానికులు ఈ ఘ‌ట‌న‌పై చ‌ర్చించుకుంటున్నారు. క‌సాయిలా మార‌డంతో వారు సాధించింది ఏమిటి అని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: