అనంతరం భర్త మరణించడంతో సమ్మక్క కూరగాయలు విక్రయిస్తూ జీవిస్తున్నది. అయితే పదో తరగతి చదువుతున్న చిన్న కుమార్తె అంజలి(17) ఇదే గ్రామానికి చెందిన రాయపురం ప్రశాంత్తో ప్రేమలో పడినది. ఈ విషయం తల్లికి తెలియడంతో కుమార్తెను పలుమార్లు మందలించినది. అయినా మార్పు రాకపోవడంతో పెళ్లి చేసుకుంటే పరువు పోతున్నదని భావించిన సమ్మక్క తన తల్లి నాము యాకమ్మతో కలిసి గత నెల 19న అర్థరాత్రి అంజలి గాఢనిద్రలో ఉండగా ముఖంపై దిండు ఉంచి ఊపిరాకుండా చేసి హత్య చేసారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు సమ్మక్క, యాకమ్మలను విచారించగా కులాంతర వివాహం చేసేందుకు ఇష్టం లేకపోవడం వల్లనే హత్య చేసామని ఒప్పుకున్నారు.
కంప్యూటర్ కాలంలో కూడా కులాల కోసం కొట్లాటలే కాదు, కన్న బిడ్డలను కసాయిలా చంపేస్తున్నారు. పెళ్లి చేసుకున్న కూతుళ్లను కడతేరుస్తున్న దారుణ సంస్కృతి రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది. అటువంటి పరువు హత్యనే వరంగల్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకున్నది. అయితే మఖ్యంగా మనుమరాలు అని చూడకుండా అమ్మమ్మ, కన్న కూతురు అని చూడకుండా తల్లి కూతురు ఉసురును తీసారు. ప్రేమించిన పాపానికి తల్లిదండ్రులు ఇలా చేయడం ఏమిటని వరంగల్లో స్థానికులు ఈ ఘటనపై చర్చించుకుంటున్నారు. కసాయిలా మారడంతో వారు సాధించింది ఏమిటి అని పలువురు చర్చించుకుంటున్నారు.