నవమాసాలు మోసి నొప్పులు అనుభవించి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. బిడ్డ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా చిన్న పిల్లాడిలా చూస్తూ ఆలనాపాలనా చూసుకుంటుంది. అందుకే తల్లి ప్రేమ ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. లోకంలో తల్లి ప్రేమను మించిన ప్రేమ మరొకటి లేదు అని అంటూ ఉంటారు. నిజమే తల్లి కంటే ఎక్కువగా పిల్లలను ఎవరు ప్రేమించలేరు. కానీ ఇక్కడ కొంతమంది తల్లులు మాత్రం పిల్లల విషయంలో ప్రవర్తిస్తున్న తీరు సభ్యసమాజాన్ని నివ్వెరపోయేలా  చేస్తుంది.. తల్లి ప్రేమకే కళంకం తెచ్చే విధంగా కొంతమంది ఏకంగా కడుపున పుట్టిన పిల్లలు విషయంలోనే కర్కశంగా ప్రవర్తిస్తున్నారు.



 ఇలా నేటి రోజుల్లో ఏకంగా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డల విషయంలో నే ఎంతో మంది తల్లిదండ్రులు దారుణంగా వ్యవహరిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఓ తల్లి ఇలాంటిదే చేసింది.. ఏకంగా కంటికి రెప్పలా కాచుకోవాల్సిన కొడుకుని చిన్న కారణంతో ప్రాణాలు తీసింది. పేగు బంధాన్ని కూడా మరిచి  కర్కశంగా ప్రవర్తించింది. ఏకంగా తల్లి ప్రేమకే  కళంకం తెచ్చే విధంగా ఆ మహిళ ప్రవర్తించింది. ఈ ఘటన ముంబైలో వెలుగులోకి వచ్చింది తన కోసం మద్యం తీసుకు రాలేదు అన్న కారణంతో ఏకంగా కొడుకునే హతమార్చింది తల్లి.



 మద్యానికి బానిసైన 52 ఏళ్ల మహిళ తరుచూ కొడుకును మద్యం తీసుకు రావాలి అంటూ గొడవ పడుతూ ఉండేది. ఈ క్రమంలోనే ఇటీవల తన కోసం మద్యం తీసుకు రాలేదు అంటూ కొడుకు తో గొడవ పెట్టుకుంది తల్లి. ఇక ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన సదరు మహిళ ఇంట్లో ఉన్న సుత్తితో కొడుకు పై దాడి చేసింది. దీంతో తల్లి కొట్టడంతో ఆ యువకుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం మహిళలను అదుపులోకి తీసుకున్నారు.  ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: