ప్రతి మనిషి జీవితంలో ప్రేమ అనేది సర్వసాధారణం అన్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరూ ఎప్పుడూ ఎవరో ఒకరి పై మనస్సు పారేసుకుంటూ ఉంటారు. ఇక ప్రేమ దూరమైతే కొన్నాళ్లపాటు బాధపడుతూ ఇక జీవితం అంటే ప్రేమ ఒక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి అంటూ రియలైజ్ అవుతూ ఉంటారు. కానీ నేటి రోజుల్లో మాత్రం ఎంతో మంది యువత ప్రేమ విఫలం అయింది అన్న కారణంతో.. ప్రేమించిన వారు దూరమయ్యారు అనే రీజన్ తో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.


 ఇక్కడ ఇలాంటిదే జరిగింది. రెండేళ్లుగా ఎంతో గాఢం గా ప్రేమించుకున్నారు ఆ ఇద్దరు యువతీ యువకులు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కుటుంబ పెద్దలను కూడా ఎంతో కష్టపడి ఒప్పించారు. కానీ మనిషి ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అంటూ ఉంటారు కదా. వీరి విషయం లో ఇది నిజమైంది. ఎంతో సంతోషం గా పెళ్లి చేసుకొని నిండు నూరేళ్ల జీవితాన్ని ఆనందం గా గడపాలని ఆశలు పెట్టుకున్న ఈ జంట విషయం లో విషాదకర ఘటన జరిగింది. ఇటీవలే ప్రియుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.  ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయిన యువతి చివరికి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది.


 తుమకూరు తాలూకా లోని ఆరేపల్లి గ్రామంలో వెలుగు లోకి వచ్చింది ఈ ఘటన. 22 ఏళ్ల సుష్మా ధనుష్ అనే యువకుడిని ప్రేమించింది. ఒకరంటే ఒకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు.  పెళ్లి చేసుకునేందుకు పెద్దలను ఒప్పించగా ముహూర్తాలు పెట్టుకోవాల్సి ఉంది. ఈ క్రమం లోనే జాతరలో పాల్గొనేందుకు ధనుష్ బైక్ పై వస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ప్రియుడు మరణ వార్త తెలిసిన సుష్మ తీవ్ర మనోవేదనకు గురై చివరికి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: