ఇటీవల కాలంలో ఎక్కడచూసినా మోసం మోసం మోసం. ప్రతి చోట మోసం తప్ప నిజాయితీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. నేటి ఆధునిక శైలిలో మనుషులలో పూర్తిగా మార్పు వచ్చేసింది. ఎదుటి వాళ్ళను ఎలా మోసం చేసి తమ అవసరాలు తీర్చుకోవాలి అని ఆలోచిస్తున్నారు తప్ప నిజాయితీగా ఉండి  గౌరవంగా బ్రతుకుదామని ఎవరూ అనుకోవడం లేదు అని చెప్పాలి. ముఖ్యంగా నేటి రోజుల్లో సైబర్ నేరగాళ్లు అయితే రెచ్చిపోతున్నారు.. ఎంతోమంది అమాయకుల ను ట్రాప్ చేసి మాయమాటలతో బుట్టలో వేసుకుని  చివరికి బ్లాక్ మెయిల్ చేస్తూ ఎన్ను నేరాలకు పాల్పడుతున్నారు అన్న విషయం తెలిసిందే.


 ఇంకొన్ని చోట్ల మంచి వాళ్ళ ముసుగులో పెంచుకుంటూ చివరికి సమయం సందర్భం చూసి అసలు స్వరూపాన్ని బయట పెడుతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి. నగ్నంగా వీడియో కాల్ అంటూ ఒక విద్యార్థినిని అడిగాడు యువకుడు  ఆ యువతి కూడా అలాగే చేసింది. చివరికి ఆ వీడియో మొత్తం రికార్డు చేసి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఇటీవలే యువకుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక లోని కోవై సమీపంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.


 పాలయం కు చెందిన 16 ఏళ్ల విద్యార్థిని ప్లస్ వన్ చదువుతుంది. అయితే పదవ తరగతి చదువుతున్న సమయంలో తన తోటి విద్యార్తితో పరిచయం ఏర్పడింది. అతను పదవ తరగతి ఫెయిల్ కావడంతో చదువు ఆపేశాడు.. వీరిద్దరూ తరచూ సెల్ ఫోన్లో మాట్లాడుకోవడం చేసేవారు. ఈ క్రమంలోనే తమ మధ్య ఉన్న చనువుతో ఓసారి నగ్నంగా వీడియో కాల్ చేయాలి కోరాడు యువకుడు.  ఆమె కూడా అలాగే చేసింది. కానీ ఆ వీడియో రికార్డు చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. పదేపదే న్యూడ్ వీడియో కాల్ చేయాలంటు కోరాడు. ఈ క్రమంలోనే భయపడిపోయి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. తల్లిదండ్రులు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: