ఈ సమాజం తల దించుకునే సంఘటన ఒకటి తాజాగా జరిగింది. ఈ ఘటన గురించి తెలుసుకుంటే అసలు ఈ సమాజం ఎటువైపు వెళ్తుందో అని అనిపించకమానదు.  ఆడపిల్ల అంటే సాక్ష్యతు ఆ శ్రీమహాలక్ష్మి అంటారు..కానీ అంతటి శ్రీమహాలక్ష్మినే పుట్టిన వెంటనే ప్రాణాలతోనే చంపాలి ప్రయత్నం చేసారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన  విషయం ఏమిటంటే ..ఆ పాపని బ్రతికుండగానే పూడ్చడానికి తీసుకువెళ్ళింది స్వయానా తండ్రి ఇంకా ఆ పాప తాతయ్య కావడం గమనార్హం.
 
కడుపులో పెరుగుతున్న ఆడపిల్లలకి సైతం భయం వేసేలా  ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగింది. సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న జూబ్లీ బస్ స్టాప్ దగ్గర బ్రతికి ఉన్న పాపని గుంత తీసి పూడ్చి పెట్టాలని ప్రయత్నం చేసారు వారిద్దరూ . కానీ ఒక ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారం తో రంగంలోకి దిగిన పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకోని ఆ పాప ప్రాణాలని కాపాడారు.


కుమార్ అనే ఒక ఆటో డ్రైవర్ కి  జూబ్లీ బస్ స్టాప్ దగ్గర అనుమానాస్పద పరిస్థితులలో ఇద్దరు కనిపించారు. వారి చేతిలో ఎదో ఉన్నట్టు గుర్తించాడు. అక్కడే ఉండి వారిని చూస్తున్న డ్రైవర్ కి కాసేపటికి దిమ్మతిరిగింది. అప్పటివరకు వారి చేతుల్లో ఉన్నది ఒక పాప అని తెలుసుకున్నాడు. ఈ లోపే వారు ఎవరూ లేని ప్రదేశానికి వెళ్లి .. పాపని పూడ్చడానికి గుంత కూడా తొవ్వేసారు. ఈ సమయంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన ఆటో డ్రైవర్ వెంటనే ఈ విషయం గురించి పోలీసులకి తెలిపాడు.


దీనితో ఆఘమేఘాల మీద పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులు ఏమి చేస్తున్నారు అని అడగ్గా ..పాప చనిపోయింది అని పోలీసులని నమ్మించే ప్రయత్నం చేసారు. కానీ ఆ పాప చేతులు కాళ్ళు కదపడంతో వారి అసలు బండారం బయటపడింది. ఆడపిల్ల పుట్టింది అనే కోపం తో వారు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తుంది. పోలీసులు నిందితులను ఇద్దరినీ అరెస్టు చేసి  అదుపులోకి తీసుకున్నారు అలాగే పాపని గాంధీ ఆసుపత్రికి తరలించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: