విద్యుత్ కొనుగోలు అమ్మకంకు సంబంధించి చాలా వివాదాలు రేగుతున్న సమయాన కేసీఆర్ మాత్రం తనదైన పంథాలో తన పని తాను చేసుకుని పోతున్నారు. మిగులు విద్యుత్ ను అమ్ముకుంటూ తన రాష్ట్ర ఖజానాకు నాలుగు కాసులు చేరవేస్తున్నారు. దీంతో తెలంగాణ చేస్తున్న పనిపై కేంద్రం మండిపడుతోంది. ప్రస్తుతం సంక్షోభం ఉన్న తరుణాన విద్యుత్ ను అవసరాల మేరకు వాడుకుని, మిగులు విద్యుత్ ను ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేయాలని, దీనిని మానవతా దృక్పథంలో భాగంగా పరిగణించి అమలు చేయాలని అంటున్నారు. అదేవిధంగా కేంద్రం చెప్పనిదే విద్యుత్ అమ్మకాలపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకునేందుకు వీల్లేదని అంటోంది. కానీ సెంట్రల్ పవర్ ఎక్స్చేంజ్ నుంచి వచ్చే విద్యుత్ విషయాన్నే పరిగణనలోకి తీసుకోవాలని, అంతేకానీ రాష్ట్రాలు ఉత్పత్తి చేసే విద్యుత్ వాడకం, అమ్మకం అన్న వాటిపై అధికారం కేంద్రానికి ఉండదని కూడా తేల్చి చెబుతోంది తెలంగాణ. దీంతో కేంద్రం, రాష్ట్రం మధ్య దూరం పెరిగిపోయినా సంబంధ బాంధవ్యాలు చెదిరిపోయినా కూడా తగ్గేదేలే అంటోంది తెలంగాణ.
విద్యుత్ కొనుగోలు అమ్మకంకు సంబంధించి చాలా వివాదాలు రేగుతున్న సమయాన కేసీఆర్ మాత్రం తనదైన పంథాలో తన పని తాను చేసుకుని పోతున్నారు. మిగులు విద్యుత్ ను అమ్ముకుంటూ తన రాష్ట్ర ఖజానాకు నాలుగు కాసులు చేరవేస్తున్నారు. దీంతో తెలంగాణ చేస్తున్న పనిపై కేంద్రం మండిపడుతోంది. ప్రస్తుతం సంక్షోభం ఉన్న తరుణాన విద్యుత్ ను అవసరాల మేరకు వాడుకుని, మిగులు విద్యుత్ ను ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేయాలని, దీనిని మానవతా దృక్పథంలో భాగంగా పరిగణించి అమలు చేయాలని అంటున్నారు. అదేవిధంగా కేంద్రం చెప్పనిదే విద్యుత్ అమ్మకాలపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకునేందుకు వీల్లేదని అంటోంది. కానీ సెంట్రల్ పవర్ ఎక్స్చేంజ్ నుంచి వచ్చే విద్యుత్ విషయాన్నే పరిగణనలోకి తీసుకోవాలని, అంతేకానీ రాష్ట్రాలు ఉత్పత్తి చేసే విద్యుత్ వాడకం, అమ్మకం అన్న వాటిపై అధికారం కేంద్రానికి ఉండదని కూడా తేల్చి చెబుతోంది తెలంగాణ. దీంతో కేంద్రం, రాష్ట్రం మధ్య దూరం పెరిగిపోయినా సంబంధ బాంధవ్యాలు చెదిరిపోయినా కూడా తగ్గేదేలే అంటోంది తెలంగాణ.