ఆ తరువాత ఏడాదే 2013లో మొదటిసారిగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మంచి ఫలితాలనే సాధించింది ఈ పార్టీ. బీజేపీ తరువాత రెండో పెద్ద పార్టీగా నిలిచి కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు కేజ్రీవాల్. అయితే జన్లోక్పాల్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టనందుకు నిరసనగా 49 రోజులకే తన పదవికి రాజీనామా చేసి ప్రభుత్వం రద్దుకు సిఫార్సు చేశారు. 2015లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను 67 స్థానాలను తన ఖాతాలో వేసుకున్న ఆప్ కళ్లు చెదిరే విజయం సాధించింది. బీజేపీని కేవలం 3 స్థానాలకు పరిమితం చేసింది. ఇక కాంగ్రెస్ తొలిసారిగా అక్కడ ఉనికిని కోల్పోయింది. ఆతరువాత 2020లో జరిగిన ఎన్నికల్లో 62 సీట్లతో మరోసారి ఘనవిజయం సాధించింది.
ఆ తరువాత ఏడాదే 2013లో మొదటిసారిగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మంచి ఫలితాలనే సాధించింది ఈ పార్టీ. బీజేపీ తరువాత రెండో పెద్ద పార్టీగా నిలిచి కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు కేజ్రీవాల్. అయితే జన్లోక్పాల్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టనందుకు నిరసనగా 49 రోజులకే తన పదవికి రాజీనామా చేసి ప్రభుత్వం రద్దుకు సిఫార్సు చేశారు. 2015లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గాను 67 స్థానాలను తన ఖాతాలో వేసుకున్న ఆప్ కళ్లు చెదిరే విజయం సాధించింది. బీజేపీని కేవలం 3 స్థానాలకు పరిమితం చేసింది. ఇక కాంగ్రెస్ తొలిసారిగా అక్కడ ఉనికిని కోల్పోయింది. ఆతరువాత 2020లో జరిగిన ఎన్నికల్లో 62 సీట్లతో మరోసారి ఘనవిజయం సాధించింది.