జ‌గ‌న్ కేబినెట్‌లోని మంత్రుల విష‌యంలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. కేబినెట్ మంత్రుల్లో ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే.. ఫైర్‌బ్రాండ్లుగా పేరు తెచ్చుకున్నారు. అయితే.. వీరిలోనూ ఒక‌రిద్ద‌రు మ‌రింత స్పెష‌ల్‌గా ఉన్నా ర‌ని.. అంటున్నారు వైసీపీ నాయ‌కులు. మ‌రీముఖ్యంగా కృష్ణాజిల్లాకు చెందిన ఇద్ద‌రు మంత్రులు కూడా ఫైర్‌బ్రాండ్లుగా ఉన్నారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని.. ఇద్ద‌రూ కూడా దూకుడుగా ఉన్నారు. నిజానికి కొడాలి ఆది నుంచి కూడా ఫైర్ బ్రాండే. ఆయన ఏం మాట్లాడినా.. సంచ‌ల‌న‌మే.

ఫైర్ బ్రాండ్‌గానే కాకుండా..సంచ‌ల‌నాలకు కూడా కొడాలి నాని సెంట్రిక్‌గా మారారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో మ‌రోమంత్రి పేర్నినానికూడా ఇదే రేంజ్‌లో దూకుడు చూపిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా.. సిని మాల వివాదం తెర‌మీదికి వ‌చ్చిన నాటి నుంచి త‌న వ్యాఖ్య‌ల‌తో ఆయ‌న దూసుకుపోతున్నారు. దీంతో పేర్ని కూడా ఫైర్‌బ్రాండ్ల జాబితాలో చేరిపోయారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఆడు.. ఈడు.. అంటూ..కామెంట్లు చేయ‌డం.. కొన్ని రోజుల కింద‌ట ఆస‌క్తిగా మారింది. దీంతో మీడియా కూడా.. ఈయ‌న‌ను ఫైర్‌బ్రాండ్ల జాబితాలోకి చేర్చేసింది.

అయితే.. ఇప్పుడు ఈ ఇద్ద‌రు పైర్ బ్రాండ్ల‌పైనా.. వైసీపీలోనే ఆస‌క్తిక‌ర జోకులు పేలు తున్నాయి. ఒక మం త్రిని మిర్చి అని.. మ‌రో మంత్రిని మ‌సాలా.. అని చెప్పుకొంటున్నారు. వారిని ఈ నిక్ నేమ్‌ల‌తోనే అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో పిలుచుకుంటుండ‌డం గ‌మ‌నార్హం. మిర్చి మినిస్ట‌ర్‌.. మ‌సాలా మినిస్ట‌ర్ అని అంటున్నారట‌. మిర్చి మినిస్ట‌ర్ అంటే.. కొడాలి నాని అంట‌. ఆయ‌న కారం లాగా మంటెత్తిస్తార‌ని అంటున్నారు. ఆ మంట కొన్ని రోజుల వ‌ర‌కు ఉంటుంద‌ని చెబుతున్నారు. అంతేకాదు.. ఆయ‌న ఫైర్ అంతా ఇంతా కాద‌ని చెప్పుకొంటున్నారు.

మ‌రోవైపు.. పేర్ని నానిని మ‌సాలా మినిస్ట‌ర్ అని చెబుతున్నారు. ఈయ‌న మాట‌లు మ‌సాలా మాదిరిగా.. ఉంటాయ‌ని.. రుచిగా ఉంటూనే.. త‌ర్వాత‌.. మంట పుట్టిస్తాయ‌ని.. ఆయ‌న నెమ్మ‌దిగా మాట్లాడుతూనే.. మాట‌ల‌తో మంట‌లు పుట్టిస్తార‌ని .. అంటున్నారు. మొత్తానికి.. ఈ ఇద్ద‌రు మంత్రుల‌ను కూడా వైసీపీ నాయ‌కులు నిక్‌నేమ్‌లు పెట్టి పిలుచుకోవ‌డం ఆస‌క్తిగా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: