దావోస్‌లో త్వరలో ప్రపంచ ఆర్థిక సదస్సు జరగబోతోంది. ఈ సదస్సుకు ఏపీ సీఎం జగన్ టీమ్‌ వెళ్లబోతోంది. అయితే.. ఇలా దావోస్‌కు రాష్ట్రాల నుంచి టీమ్‌లు వెళ్లడం కొత్తేమీ కాదు.. రండి.. రండి .. మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి.. అంటూ అక్కడి పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు కావడం.. ఆ సమావేశాల మీటింగ్‌ల వివరాలను మీడియాలో ప్రచారం చేసుకోవడం.. ఇదిగో రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురాబోతున్నామని చెప్పకోవడం.. గతంలో చాలాసార్లు ఏపీ ప్రజలు చూసిన అనుభవమే.


మరి ఇప్పుడు సీఎం జగన్ కూడా అదే బాటలో వెళ్తున్నారు. దావోస్ సదస్సు ద్వారా ఏపీకి పెట్టుబడులు వస్తాయని ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ కూడా చెబుతున్నారు. ఈ దావోస్‌లో 18 అంశాలపై సదస్సు జరుగుతుందని  మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వివరించారు. వీటిలో 10 అంశాలు ప్రాధాన్యతగా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోందని  మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అంటున్నారు. అవేంటంటే.. వ్యవసాయం, పర్యాటకం, విద్య, వైద్య, ఆర్థిక అంశాలు. ఏపీ సర్కారు ఈ పది అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందట.


అలాగే బీచ్ ఐటీ అనే నినాదంతో ఐటి రంగాన్ని  మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అభివృద్ధి చేస్తామంటున్నారు.  వైయ‌స్సార్ హయాంలో విశాఖలో ఐటికి బీజం పడిందంటున్న  మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌.. ఇప్పుడు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో మరింత ప్రగతి సాధిస్తోందని దీమాగా చెబుతున్నారు. బీచ్ ఐటి నినాదం విశాఖకు కలిసి వస్తుందని  మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

 

తాజాగా విశాఖలో జరిగిన ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ సమావేశంలో  మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ... వైజాగ్ ఎయిర్‌పోర్ట్ నాలుగు విమానాల నుంచి 64 విమానాల స్థాయికి ఎదిగిందని వివరించారు. 18 లక్షలు మంది ప్రయాణికులు పోకలు సాగిస్తున్నారని.. మలేసియా, బ్యాంకాక్‌, సింగపూర్‌లకు విమాన సర్వీసులు పునరుద్ధరణ జరుగుతోందని చెబుతున్నారు. జులై నుంచి విశాఖ-కోలంబో మధ్య విమాన సర్వీసులు ప్రారంభమవుతాయట. బావుంది.. అంతా బాగానే ఉంది.. ఊహల లెక్కలు బాగానే ఉంటాయి. వాస్తవ రూపం దాలిస్తేనే ఏదైనా మంచి అంటూ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: