నేటి బీజేపీ పాలకులు లక్షల కోట్లు దోచుకున్నవారిని వదిలేసి.. నిరుపేదలపై అనేక పన్నుల భారం మోపుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జాతీయ జండా ఎగరేసిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రజలకు పేరుపేరునా స్వాతంత్ర్య వజ్రోత్సవం సందర్భంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా తన నివాసంలో జాతీయ జెండాను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. కోవిడ్ లక్షణాలు ఉండడంతో సెల్ఫ్ క్వారంటీన్ లో ఉన్న రేవంత్ రెడ్డి.. వజ్రోత్సవాల సందర్బంగా జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో స్వతంత్ర వేడుకలు నిర్వహించారు.


ఈ సందర్భంగా ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. సర్వమత సహనంతో ఒక లౌకిక దేశంగా ప్రపంచంలో ఆదర్శంగా ఉన్న భారత దేశం నేడు బీజేపీ పాలకుల చేతిలో చితికిపోతుందన్నారు. దేశం నేడు మత ప్రాతిపదికగా చేరలిపోతుందని.. స్వతంత్ర పోరాటంలో ఏ మాత్రం పాలు పంచుకొని కొన్ని శక్తులు నేడు దేశాన్ని మత ప్రాతిపదికగా చీల్చి రాజకీయ లబ్ది పొందాలని చూస్తుందని అన్నారు. ప్రభుత్వ సంస్థలను వారి తాబేదార్లకు ఇచ్చి ప్రజా ఆస్తులను కొందరికి కట్ట బెడుతున్నారని.. లక్షల కోట్లు కొల్లగొట్టిన వారిని, బ్యాంకులను మోసం చేసి లక్షల కోట్లు ఎగ్గొట్టిన వారిని  వదిలేసి పేదలపై పన్నులు, అధిక ధరలు, భారం మోపుతుతున్నారన్నారు.


దేశం, ధర్మం అనే మాటలతో మభ్య పెడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని.. రాజకీయ లబ్ది కోసం దేశంలో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మనం పోరాటం చేసి సాధించుకున్న దేశాన్ని మనం కాపాడుకోవాలని.. మత ఛాందస వాదుల నుంచి దేశాన్ని రక్షించి ప్రజలకు మంచి పాలన అందించాలని..  అందుకోసం మరో పోరాటానికి ప్రజలు సిద్ధపడాలని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు.


కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితంగా.. వీరుల త్యాగంగా నేటి మన స్వాతంత్రం వచ్చిందన్న రేవంత్ రెడ్డి.. వ్యవసాయ, పారిశ్రామిక, సాంకేతిక, సేవ రంగాలలో అగ్రగామిగా నిలిపిన ఘనత కాంగ్రెస్ పాలకులదని గుర్తు చేసుకున్నారు. బీజేపీ పాలకులు దేశాన్ని కార్పోరేట్ శక్తులకు అమ్ముతున్నారని..
విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: