ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్సార్‌ వర్శిటీగా మార్చిన సంగతి తెలిసిందే. ఈ పేరు మార్పుపై టీడీపీ ఎన్నో ఆందోళనలు చేసింది.. కానీ ఫలితం లేకపోయింది. అయినా టీడీపీ వదిలి పెట్టడం లేదు. చివరగా ఓ ప్రయత్నం చేస్తోంది. మార్పుపై నేషనల్ మెడికల్ కమిషన్  చైర్మన్ కు తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర లేఖ రాశారు. ఎన్టీఆర్ కీర్తి ప్రతిష్టలు దెబ్బతీయడానికి, ఆయనను అవమానించేందుకే యూనివర్శిటీకి పేరు మార్పు చేశారని మండిపడ్డారు.


ఒక విద్యాసంస్థ బ్రాండ్ ఇమేజ్ ను బట్టి ఆ విధ్యార్ధుల భవిష్యత్తు ఎంతగా ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. దేశ విదేశాలలో ఎన్టీఆర్ అన్న పేరుకు ఎంతో ఉన్నతమైన పేరు, వ్యక్తిత్వం ఉన్నాయన్నారు.  ఎన్టీఆర్ అన్న పేరు ప్రతీ తెలుగువాడి, ప్రతీ భారతీయుడి హృదయాలను టచ్ చేసే పేరని ఎంపీ గుర్తుచేశారు.  గొప్ప మహోన్నతమైన పేరు మార్పు చేయడాన్ని ఊహించుకోలేకున్నమన్నారు.  దీనిపై తమరు జోక్యం చేసుకుని పేరు మార్పును నిలుపుదల చేసి సంస్థ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడగలరని కోరారు.


పేరు మార్పుతో గత నాలుగు దశాబ్దాలుగా నిర్మించుకున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడమే కాకుండా దేశ విదేశాలలో వైద్య విద్యార్ధులు సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందరి ఎంపీ లేఖలో స్పష్టంచేశారు.  పేదలకు మెరగైన వైద్య సేవలు అందించేందుకు దేశంలోనే ప్రప్రధమంగా 1986 లో అన్ని మెడికల్ కాలేజీలను ఎన్టీఆర్ యూనివర్శిటీ కిందకు తీసుకొచ్చారని ధ్వజమెత్తారు.  


నాడు ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో వైద్యరంగంలో అనేక మార్పులు చోటుచేసుకోవడమే కాకుండా వైద్య విద్యార్ధులకు, పేదవర్గాలకు ఎంతగానే ఉపయోగపడిందని దుయ్యబట్టారు. ఒక దశాబ్దకాలం తర్వాత ఈ సంస్థ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా పేరొంది,దేశ విదేశాలలో వేల మంది వైద్యవిద్యార్ధులు అనేక కీలక పదవులలో స్థిరపడ్డారని ఎంపీ లేఖలో పేర్కొన్నారు. పేరు మార్పుకు వైకాపా  ప్రభుత్వం  చెబుతున్న కారణాలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: